VENKATA SHIVUDU YADAV : టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా వెంకటశివుడు యాదవ్
ABN , Publish Date - Apr 24 , 2024 | 11:52 PM
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా గొంది వెంకటశివుడు యాదవ్ నియమితులయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం నియామకపు ఉత్వర్వులు జారీ చేశారు. గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తికి చెందిన వెంకటశివుడు యాదవ్ 1999లో టీడీపీలో చేరారు. 2016 నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2014లో ఆయన గుంతకల్లు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించినా, పార్టీ అధిష్టానం ...
అనంతపురం అర్బన/గుతి, ఏప్రిల్ 24: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా గొంది వెంకటశివుడు యాదవ్ నియమితులయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం నియామకపు ఉత్వర్వులు జారీ చేశారు. గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తికి చెందిన వెంకటశివుడు యాదవ్ 1999లో టీడీపీలో చేరారు. 2016 నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2014లో ఆయన గుంతకల్లు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించినా, పార్టీ అధిష్టానం ఇవ్వలేకపోయింది. ఈ ఎన్నికల్లోనూ అవకాశం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో ఆయనను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ, ప్రాధాన్యం కల్పించారు. పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....