Balakrishna: పైశాచిక ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం
ABN , Publish Date - Jan 09 , 2024 | 04:15 PM
మున్సిపల్ కార్మికులకు తెలుగుదేశం ( TDP ) అండగా ఉంటుందని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) అన్నారు. మంగళవారం నాడు హిందూపురంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపారు.
![Balakrishna: పైశాచిక ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం](https://media.andhrajyothy.com/media/2023/20231205/1_NBK_a98d590d5c.jpg)
హిందూపూర్: మున్సిపల్ కార్మికులకు తెలుగుదేశం ( TDP ) అండగా ఉంటుందని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) అన్నారు. మంగళవారం నాడు హిందూపురంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపారు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి హస్తమించే వరకు పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదన్నారు. జగన్ పాదయాత్రకు ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. పైశాచిక ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. మహిళలకు ఎన్టీఆర్, చంద్రబాబు పెద్దపీట వేశారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే గుణపాఠం చెబుతామని నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...