Share News

AP News: హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటన.. గార్మెంట్స్ పరిశ్రమలపై ఎఫెక్ట్

ABN , Publish Date - Jan 08 , 2024 | 02:11 PM

Andhrapradesh: హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఎఫెక్ట్ గార్మెంట్స్ పరిశ్రమలపై పడింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని పరిశ్రమలకు సెలవు ప్రకటించి కార్మికులను సమావేశాలకు తరలించాలంటూ వైసీపీ నేతలు సూచించారు.

AP News: హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటన.. గార్మెంట్స్ పరిశ్రమలపై ఎఫెక్ట్

శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandrareddy) పర్యటన ఎఫెక్ట్ గార్మెంట్స్ పరిశ్రమలపై పడింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని పరిశ్రమలకు సెలవు ప్రకటించి కార్మికులను సమావేశాలకు తరలించాలంటూ వైసీపీ నేతలు సూచించారు. అయితే వైసీపీ నేతల హెచ్చరికలను పట్టించుకోకుండా యజమాన్యాలు గార్మెంట్స్ పరిశ్రమలు నడుపుతున్నారు. దీంతో తమ హెచ్చరికలు పట్టించుకోకుండా నడుపుతున్న గార్మెంట్స్ పరిశ్రమలపై కక్ష సాధింపుల్లో భాగంగా వైసీపీ నేతలు పవర్ కట్ చేయించారు.

వైసీపీ నేతల తీరుపై పరిశ్రమ యజమానులు మండిపడుతున్నారు. పరిశ్రమలకు సెలవు ప్రకటించి మహిళా కార్మికులను సమావేశాలకు పంపించాలని బెదిరించడం ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చేసేదేమీ లేక యాజమాన్యాలు జనరేటర్ల సాయంతో గార్మెంట్స్ పరిశ్రమలను రన్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 08 , 2024 | 02:11 PM