Home » Peddi Reddi Ramachandra Reddy
Andhrapradesh: ఏపీలో పోలింగ్ మొదలవక ముందే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో ఏకంగా టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేశారు వైసీపీ నేతలు. అది కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలోనే.
పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ డబ్బు పంపిణీని ప్రారంభించింది. ఓటుకు రూ.2 వేల ప్రకారం బుధవారం పంచినట్లు తెలిసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరవర్గం నియోజకవర్గంలో తిష్టవేసి.. డబ్బు పంపిణీ వ్యవహారాలను చూస్తోందని ప్రచారం జరుగుతోంది. గ్రామాల్లో ముఖ్యమైన నాయకులకు డబ్బులు చేరవేసి.. అక్కడి నుంచి పంచాయతీల వారీగా డబ్బులు చేరవేస్తున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ పరిధిలో వలంటీర్లను దగ్గర పెట్టుకుని.. వైసీపీ...
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్ (Ramachandra Yadav)పై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులపై ఏపీ హైకోర్టు (AP High Court)లో రామచంద్రయాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్నికల ప్రచారం చేసుకోనివ్వకుండా ప్రభుత్వం అడ్డుపడుతుందని హైకోర్టులో ఆయన పిటీషన్ వేశారు.
జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అరాచకాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి తాను, కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు సీఎంగా పనిచేశామని గుర్తుచేశారు. పుంగనూరులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ’’ప్రజాగళం‘‘ వేదికగా సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
అధికార వైసీపీ(YSRCP) అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో వైసీపీకి బలంగా ఉన్న ప్రత్యర్థి పార్టీ నేతలపై కుట్రకు పన్నింది. ఇందులో భాగంగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డుగా ఉన్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav)పై పోలీసులను ఉసిగోల్పుతున్నారు.
ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా.. ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) ప్రశ్నించారు. రాష్ట్రంలో సైకో(జగన్) ఉంటే.. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని విరుచుకుపడ్డారు.
ఏపీలో వైసీపీ (YSRCP) నేతలు ప్రజలను, ప్రతిపక్షాలను భ్రయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. పుంగనూరు నియోజకవర్గం ఏపీలో లేదా అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక సామ్రాజ్యం నడుపుతున్నారా అని ప్రశ్నించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అధికార వైసీపీ (YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే చిత్తూరు (Chittoor) జిల్లాలో మరోసారి అరాచకాలు, అలజడులు సృష్టించడానికి వైసీపీ ప్లాన్ చేసింది. జిల్లాలో మరోసారి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. అధికార పార్టీకి బలంగా ఉన్న ప్రత్యర్థులపై దాడులకు తెగబడ్డారు.
Andhrapradesh: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన ప్రచార శ్రేణులపై కర్రలతో దాడులు పాల్పడ్డారు. తమ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తే చంపేస్తామంటూ బెదిరింపులుకు దిగారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఓ విషయంలో రెండుసార్లు తన కాళ్లు పట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి (Kiran Kumar Reddy) హాట్ కామెంట్స్ చేశారు. గురువారం నాడు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.