NOMINATIONS : ఎంపీకి 38.. ఎమ్మెల్యేలకు 220 పైగా..
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:48 PM
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పక్రియ గురువారం ముగిసింది. ఈనెల 18 నుంచి జిల్లాలో అనంత పార్లమెంటు స్థానానికి, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు జిల్లా యంత్రాంగం నామి నేషన్లు స్వీకరించింది. వివరాలు ఇలా..
ముగిసిన నామినేషన్ల గడువు
అనంతపురం టౌన, ఏప్రిల్ 25: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పక్రియ గురువారం ముగిసింది. ఈనెల 18 నుంచి జిల్లాలో అనంత పార్లమెంటు స్థానానికి, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు జిల్లా యంత్రాంగం నామి నేషన్లు స్వీకరించింది. వివరాలు ఇలా..
అనంత పార్లమెంటుకు 38..
అసెంబ్లీ స్థానాలకు 220కుపైగా ..
నేడు నామినేషన్ల పరిశీలన
ఉపసంహరణకు 29వరకు గడువు
మే 13న ఎన్నికలు
జూన 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు
నేటితో పోస్టల్బ్యాలెట్కు ఆఖరిగడువు
పోస్టల్బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం చివరిరోజు అని కలెక్టరు వినోద్కుమార్ తెలిపారు. ఎన్నికల డ్యూటీలో ఉన్న ప్రతి శాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటుకోసం ఫారం-12ను పనిచేసే నియోజవర్గ ఆర్ఓలకు ఇవ్వాలని కలెక్టరు కోరారు.
పరిశీలన పక్కాగా చేపట్టాలి: కలెక్టర్
అనంతపురం టౌన, ఏప్రిల్ 25: నామినేషన్ల స్ర్కూట్నీ పక్రియను పక్కాగా చేపట్టాలని కలెక్టరు డాక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స ద్వారా స్ర్కూట్నీపై రిటర్నింగ్ అధికారులతో మాట్లాడారు. శుక్రవారం షెడ్యూల్ మేరకు నామినేషన్ల పరిశీలన (స్ర్కూట్నీ) జరగుతుందన్నారు.
పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చిన నామినేషన్లను పక్కాగా పరిశీలించాలన్నారు. ఇందుకు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పరిశీలనపై ఎక్కడైనా, ఏమైనా సందేహాలు వస్తే వెంటనే వాటిని నివృత్తి చేసుకొని పకడ్బందీగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....