Share News

AP News: కూలీలతో వెళుతున్న బొలేరో వాహనం బోల్తా.. 30 మందికి గాయాలు

ABN , Publish Date - Feb 26 , 2024 | 08:24 AM

ఉరవకొండలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. బతుకు దెరువు కోసం తెల్లవారుజామునే బాక్సులు కట్టుకుని బొలేరో వాహనంలో 40 మంది కూలీలు వజ్రకరూరు నుంచి పాల్తూరుకు వెళుతున్నారు. అంతా హ్యాపీగా సందడి చేసుకుంటూ వెళుతుండగా.. గుంతకల్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో బొలెరో టైర్ పంక్చరైంది. అంతే ఒక్కసారిగా వాహనం బోల్తా పడింది.

AP News: కూలీలతో వెళుతున్న బొలేరో వాహనం బోల్తా.. 30 మందికి గాయాలు

అనంతపురం: ఉరవకొండ (Vuravakonda)లో దారుణ రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. బతుకు దెరువు కోసం తెల్లవారుజామునే బాక్సులు కట్టుకుని బొలేరో (Bolero) వాహనంలో 40 మంది కూలీలు వజ్రకరూరు నుంచి పాల్తూరుకు వెళుతున్నారు. అంతా హ్యాపీగా సందడి చేసుకుంటూ వెళుతుండగా.. గుంతకల్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో బొలెరో టైర్ పంక్చరైంది. అంతే ఒక్కసారిగా వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 26 , 2024 | 08:24 AM