Tatikonda Rajaiah: కడియం శ్రీహరిపై మరోసారి రాజయ్య వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
ABN , First Publish Date - 2023-10-02T15:48:34+05:30 IST
కడియం శ్రీహరి(Kadiam Srihari)పై మరోసారి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) కీలక వ్యాఖ్యలు చేశారు.
![Tatikonda Rajaiah: కడియం శ్రీహరిపై మరోసారి రాజయ్య వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?](https://media.andhrajyothy.com/media/2023/20230730/Tatikonda_Rajaiah_b9a8311f81.jpg)
జనగామ: కడియం శ్రీహరి(Kadiam Srihari)పై మరోసారి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు రాజయ్య బీఆర్ఎస్ పార్టీ కార్యాయలంలో సమావేశ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను సమన్వయం చేయకుండానే కడియం శ్రీహరి నియోజకవర్గంలో ప్రచారం చేయడం సరికాదు. ఈనెల 6వ తేదీ తర్వాత పార్టీ శ్రేణులను సమన్వయ పరిచే మీటింగ్ పెడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆ మీటింగ్ జరగకుండానే కడియం శ్రీహరి ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ ఎమ్మెల్యే చేతుల మీదుగానే జరగాలి. అభివృద్ధిని అడ్డుకోవడం మంచిది కాదు’’ అని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.