Muthireddy Yadagiri Reddy: పల్లా రాజేశ్వర్‌రెడ్డి పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నారు

ABN , First Publish Date - 2023-10-01T17:49:28+05:30 IST

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(Muthireddy Yadagiri Reddy) మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.

Muthireddy Yadagiri Reddy: పల్లా రాజేశ్వర్‌రెడ్డి పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నారు

జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(Muthireddy Yadagiri Reddy) మరోసారి సంచలన వాఖ్యలు చేశారు. ఆదివారం నాడు బచ్చన్నపేట కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy) పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నారు. పార్టీని రెండు వర్గాలుగా విభజిస్తున్నారు. కేసీఆర్ ఆదేశాలు ధిక్కరించి మీటింగ్‌లు పెడుతున్నారు. పల్లా సమైఖ్యవాది, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి. నీపై ఎన్ని తెలంగాణ ఉద్యమ కేసులు ఉన్నయో నాకు తెలుసు. నాపై తెలంగాణ ఉద్యమ రైల్వే కేసులు ఇంకా ఉన్నవి’’ అని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-01T17:49:28+05:30 IST