RS Praveen Kumar: ఆ మంత్రి చీకటి దందాను వెలికి తీస్తాం

ABN , First Publish Date - 2023-09-04T16:43:40+05:30 IST

విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి(Minister Jagdish Reddy) చీకటి దందాను వెలికి తీస్తామని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)హెచ్చరించారు. సోమవారం నాడు సూర్యాపేటలో పర్యటించారు.

RS Praveen Kumar:  ఆ మంత్రి చీకటి దందాను వెలికి తీస్తాం

సూర్యాపేట: విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి(Minister Jagdish Reddy) చీకటి దందాను వెలికి తీస్తామని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)హెచ్చరించారు. సోమవారం నాడు సూర్యాపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి జగదీశ్‌రెడ్డి చీకటి దందాను అడ్డుకున్నందుకే సూర్యాపేటలో బీసీ నేత వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. వట్టే జానయ్య యాదవ్‌కు మంత్రి జగదీశ్ రెడ్డితో ప్రాణహనీ ఉందన్నారు.వట్టే జానయ్య యాదవ్‌(Vatte Janaiah Yadav)పై పీడీ కేసు నమోదు చేసేందకు పోలీసుల కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో బీసీ నాయకులపై దాడులు పెరిగాయన్నారు. బీఅర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR)పై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. పోలీసులు కేవలం ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటలిజెన్స్ అధికారులు కేసీఆర్‌ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.

Updated Date - 2023-09-04T16:43:40+05:30 IST