Share News

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కవల పిల్లలు

ABN , First Publish Date - 2023-10-27T22:30:10+05:30 IST

బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఆరు లైన్లు, ఇండస్ట్రీయల్ కారిడార్ నిర్మిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు , కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) అన్నారు.

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కవల పిల్లలు

సూర్యాపేట: బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఆరు లైన్లు, ఇండస్ట్రీయల్ కారిడార్ నిర్మిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు , కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్ట్‌ను మంజూరు చేయలేదు.డిసెంబర్ 3వ తేదీన బీజేపీ గెలిచాక పేద ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. ఫామ్ హౌస్‌లో ఉండే ముఖ్యమంత్రి కాకుండా ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి వస్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కవల పిల్లలు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిస్తే బీఆర్ఎస్‌ పార్టీకి అమ్ముడు పోతారు’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-10-27T22:30:10+05:30 IST