Sriramulu : పల్లా రాజేశ్వ‌‌ర్‌రెడ్డి జనగామ బరి నుంచి తప్పుకోవాలి

ABN , First Publish Date - 2023-09-28T16:35:04+05:30 IST

జనగామ(Janagama) నియోజకవర్గ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కోసం సీఎం కేసీఆర్{CM KCR) సర్వేలు నిర్వహించి టికెట్ కేటాయించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మండల శ్రీరాములు(Sriramulu) పేర్కొన్నారు.

Sriramulu : పల్లా రాజేశ్వ‌‌ర్‌రెడ్డి జనగామ బరి నుంచి తప్పుకోవాలి

సిద్దిపేట: జనగామ(Janagama) నియోజకవర్గ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కోసం సీఎం కేసీఆర్{CM KCR) సర్వేలు నిర్వహించి టికెట్ కేటాయించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మండల శ్రీరాములు(Sriramulu) పేర్కొన్నారు. చేర్యాల మండలం ఆకునూర్‌లో గురువారం నాడు బీఆర్ఎస్ కార్యకర్తలతో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మీడియాతో మాట్లాడుతూ..‘‘జనగామ టికెట్ కేటాయించకపోతే 50 వేల మంది కార్యకర్తలతో సభ ఏర్పాటు చేసి జనగామ బరిలో ఉంటానని సీఎం కేసీఆర్‌‌ను హెచ్చరించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా నాలుగేళ్లు సమయం ఉంది, కాబట్టి జనగామ బరిలో నుంచి తప్పుకోవాలి. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం జనగామ కాబట్టి బీసీ బిడ్డనైన నాకు జనగామ టికెట్ కేటాయించాలి’’ అని శ్రీరాములు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-28T16:35:04+05:30 IST