Praveen Kumar: రాబోయే రోజుల్లో ఫాంహౌస్‌లో నీలి జెండాలు పాతుతాం

ABN , First Publish Date - 2023-09-20T19:33:39+05:30 IST

సిద్దిపేట(Siddipet)లో దొరల గడిలా మీద బహుజన దండయాత్ర చేస్తున్నాం... రాబోయే రోజుల్లో కేసీఆర్ ఫాంహౌస్‌(KCR Farmhouse)లో నీలి జెండాలు పాతుతామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్( Praveen Kumar) హెచ్చరించారు.

 Praveen Kumar: రాబోయే రోజుల్లో ఫాంహౌస్‌లో నీలి జెండాలు పాతుతాం

సిద్దిపేట: సిద్దిపేట(Siddipet)లో దొరల గడిలా మీద బహుజన దండయాత్ర చేస్తున్నాం... రాబోయే రోజుల్లో కేసీఆర్ ఫాంహౌస్‌(KCR Farmhouse)లో నీలి జెండాలు పాతుతామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్( Praveen Kumar) హెచ్చరించారు. బుధవారం నాడు సిద్దిపేటలోని శివమ్స్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన బహుజన దండ యాత్ర సభలో ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మీరు ఏ బంద్ ఇచ్చిన.. మా బహుజనులు మీకు బంద్ పెడతారు. కేసీఆర్ అవినీతిపై దండయాత్ర చేస్తాం. రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam)లో మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) జైళ్లో ఉండాలి.. కానీ 100 కోట్ల ముడుపులు ఇచ్చిన కవిత ఎట్లా బయట ఉంటారు. కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు. కేసీఆర్ గజ్వేల్‌(Gazwal)లో ఓడి పోతున్నారు.. అందుకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు..అక్కడ కూడా బహుజనులు ఉన్నారు.. కేసీఆర్ ఒడిపోతారు’’ అని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-20T19:33:39+05:30 IST