Congress VS BRS: రేగ కాంతారావుపై ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-08-24T19:10:56+05:30 IST

రేగ కాంతారావు(Rega Kantha Rao.)పై ఎమ్మెల్యే పొదెం వీరయ్య(MLA Podem Veeraya) సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Congress VS  BRS:  రేగ కాంతారావుపై ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంచలన వ్యాఖ్యలు

భద్రాద్రి కొత్తగూడెం: రేగ కాంతారావు(Rega Kantha Rao.)పై ఎమ్మెల్యే పొదెం వీరయ్య(MLA Podem Veeraya) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఊసరవెల్లిలా రంగులు మార్చే బుద్ధి నీది. కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్‌(BRS)లో చేరి కాంగ్రెస్(Congress) ఫలాలను అనుభవిస్తున్నది నువ్వు. నేను నిజాయితీగా ఉన్న కాంగ్రెస్‌లోనే ఉంటా. నీలా రంగులు మార్చే బుద్ధి నాది కాదు. ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత అభివృద్ధి చేసిందో నీకు తెల్వదా?భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావ్ మళ్లీ కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతున్నావ్. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలానికి చేసింది శూన్యం.

ఆలయ అభివృద్ధి అన్నాడు అభివృద్ధి చేయలేదు కరకట్టలు అన్నాడు ఏమి నిర్మించలేదు’’ అని పొదెం వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-24T20:08:51+05:30 IST