YS Sharmila: బీఆర్‌ఎస్ నేతలపై మహిళా కమిషన్‌కు వైఎస్ షర్మిల ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-03-15T13:03:35+05:30 IST

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం జాతీయ మహిళ కమిషన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

YS Sharmila: బీఆర్‌ఎస్ నేతలపై మహిళా కమిషన్‌కు వైఎస్ షర్మిల ఫిర్యాదు

న్యూఢిల్లీ: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) బుధవారం జాతీయ మహిళా కమిషన్‌ (National Commission for Women)ను కలిశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతల (BRS Leaders) పై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళా కమిషన్ ముందు పెట్టారు. మహిళలు అనే గౌరవం బీఆర్‌ఎస్ పార్టీకి లేదని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న తనపై దాడులకు దిగుతున్నారని తెలిపారు. పబ్లిక్‌గానే ఎలా బయట తిరుగుతావో చూస్తాం అంటూ బెదిరిస్తున్నారని అన్నారు. తెలంగాణలో మహిళలకు గౌరవం, రక్షణ లేదన్నారు.

‘‘కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఆడవాళ్ళు అంటే వ్రతాలు చేసుకోవాలి అంటారు.. మహిళలు అంటే ఒక మత్రికి మరదలుతో సమానం అంట. ఒక ఎమ్మెల్యే మహిళా అని చూడకుండా కొజ్జా అని అంటున్నారు. ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తే శిఖండి అని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు’’ అంటూ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ (Rekha Sharma is the chairperson of the Women's Commission) సానుకూలంగా స్పందించారు. అసభ్యకర పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకుంటామని షర్మిలకు హామీ ఇచ్చారు.

Updated Date - 2023-03-15T13:08:55+05:30 IST