Raghunandan Rao: దళిత బంధు జూటా

ABN , First Publish Date - 2023-08-10T16:38:44+05:30 IST

దళిత బంధు(Dalit Bandhu) జూటా అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Dubbaka MLA Raghunandan Rao) అన్నారు.

Raghunandan Rao: దళిత బంధు జూటా

హైదరాబాద్(Hyderabad): దళిత బంధు(Dalit Bandhu) జూటా అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Dubbaka MLA Raghunandan Rao) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..’’ మెతుకుసీమ కేసీఆర్‌కు ఓనమాలు నేర్పింది. డబుల్ బెడ్రూం ఇళ్లు లేవు.. గొర్రెలు లేవు. గరిబోణికి ఇళ్లు కట్టడం లేదు. మూడోసారి అధికారంలోకి వస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగడం లేదు.3 లక్షలతో ఇళ్లు అవుతదా.సీఎం కేసీఆర్(cm kcr) పుట్టిన మెదక్(Medak) గడ్డ నుంచే ఉద్యమిస్తాం. బీజేపీ బలమెంతో మెతుకుసీమ నుంచి చూపిస్తాం. పట్టపగలు సూటి కేసులతో దొరికితే ఎండేళ్లు ఎందుకు విచారణ చేయలేదు. బీజేపీ బీఆర్ఎస్(BJP BRS) ఒక్కటి కాదు.. కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే. పార్లమెంట్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని మాట్లాడుతున్నారు. కేసీఆర్ అహంకారం దిగాలని దుబ్బాకలో నన్ను గెలిపించిండ్రు. గ్రూప్ 2 విద్యార్థుల(Group 2 students) భవిష్యత్‌తో నాటకం ఆడారు’’ అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

Updated Date - 2023-08-10T16:38:44+05:30 IST