Pawan Kalyan: స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం..మానవ తప్పిదమా? అజాగ్రత్త వల్లా..?
ABN , First Publish Date - 2023-03-17T12:37:05+05:30 IST
పాతికేళ్లు నిడకుండానే ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena chief Pawan Kalyan) తీవ్ర ఆవేదన

హైదరాబాద్: పాతికేళ్లు నిడకుండానే ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena chief Pawan Kalyan) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ సూచించారు. సికింద్రాబాద్లోని స్వప్న లోక్ కాంప్లెక్స్లో(Swapna Lok Complex) గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పాతికేళ్లు కూడా నిండని నలుగురు యువతులు, ఇద్దరు యువకులు మృతి చెందటం చాలా బాధాకరమైన విషయం ఇది. ఉద్యోగం కోసం పొట్ట చేతి పట్టుకొని రాజధానికి వచ్చిన బిడ్డలు ఈ ప్రమాదంలో అశువులు బాయడం చాలా బాధించిందన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూలంకషంగా, శాస్త్రీయంగా దర్యాప్తు చేపట్టాలన్నారు. ఈ ఘటన మానవ తప్పిదమా? అజాగ్రత్త వల్లా? భవన నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడమా అనేది తెలియవలసి ఉందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ కోరారు.