MP Avinash: సీబీఐ కోర్టుకు హాజరైన ఎంపీ అవినాశ్‌

ABN , First Publish Date - 2023-08-15T02:45:02+05:30 IST

ఏపీ సీఎం జగన్‌ బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న వైసీపీ కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సోమవారం సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు.

 MP Avinash: సీబీఐ కోర్టుకు హాజరైన ఎంపీ అవినాశ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం జగన్‌ బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న వైసీపీ కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సోమవారం సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఇతర నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డిలను కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. నిందితుల హాజరును నమోదు చేసుకున్న కోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబరు 1కి వాయిదా వేసింది. మరోవైపు ఏ-5 శివశంకర్‌ రెడ్డి తనకు బెయిల్‌ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం.. కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్‌ 1కి వాయిదా పడింది.

Updated Date - 2023-08-15T03:07:02+05:30 IST