Share News

TS Police: కేపీహెచ్‌బీలో యువకుడిని చితకబాదిన పోలీసులు.. బాధితుడికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Dec 26 , 2023 | 04:16 PM

నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ( KPHB ) పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. ఓ కేసులో విచారణ నిమిత్తం ప్రణీత్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి దారుణంగా కొట్టి, థర్ద్ డిగ్రీ ప్ర యోగించారని బాధితుడు ఆరోపించాడు. తీవ్రమైన గాయాలతో బాధితుడు ప్రణిత్ కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు..

TS Police: కేపీహెచ్‌బీలో యువకుడిని చితకబాదిన పోలీసులు.. బాధితుడికి తీవ్ర గాయాలు

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ( KPHB ) పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. ఓ కేసులో విచారణ నిమిత్తం ప్రణీత్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి దారుణంగా కొట్టి, థర్ద్ డిగ్రీ ప్ర యోగించారని బాధితుడు ఆరోపించాడు. తీవ్రమైన గాయాలతో బాధితుడు ప్రణిత్ కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు.. అయితే ఆస్పత్రి ఖర్చులు భరించలేకపోవడంతో గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అక్కడ చేరాడు. ఈ విషయం సైబరాబాద్ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో విచారణకు కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశించారు.

వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లాకు చెందిన మొవ్వా ప్రణీత్‌కు అదే జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో 2018లో వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య విబేధాలు రావడంతో శ్రీలక్ష్మి, ప్రణీత్‌పై గుంటూరులోని దిశ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. విభేదాల నేపథ్యంలో వేర్వేరుగా ప్రణీత్, శ్రీలక్ష్మి ఉంటున్నారు. హైదరాబాద్‌లో ఓ బ్యాంకులో మేనేజరుగా ప్రణీత్ పనిచేస్తున్నాడు. తన సర్టిఫికెట్లు తన భర్త వద్దే ఉన్నాయని గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో మరోసారి శ్రీలక్ష్మి ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో ఉండగా మళ్లీ కేసు నమోదు చేయమని నల్లపాడు పోలీసులు వెనక్కి పంపించారు. ప్రణీత్ నిజాంపేట్‌లో ఉండడంతో కేపీహెచ్‌బీ పోలీసులకు శ్రీలక్ష్మి ఫిర్యాదు చేసింది.

విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించి ప్రణీత్‌ను ఇన్‌స్పెక్టర్, ఓ ఎస్ఐ విచక్షణ రహితంగా కొట్టినట్లు సమాచారం. తనపై అప్పటికే కేసు నమోదై విచారణలో ఉన్నట్లు ప్రణీత్ తెలిపిన పోలీసులు కనికరించలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీలక్ష్మి సర్టిఫికెట్స్ ఇవ్వాలని శనివారం ప్రణీత్‌ను పోలీస్ స్టేషన్‌కి పిలిచి సీఐ కొట్టారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లు తనపై విచక్షణ రహితంగా దాడి చేశారని బాధితుడు చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా సైబరాబాద్ సీపీకి బాధితుడు ప్రణీత్ ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి విచారణకు ఆదేశించారు.

Updated Date - Dec 26 , 2023 | 04:17 PM