Share News

KA Paul : కేసీఆర్ కోసం ఏసుప్రభువుని ప్రార్థించా

ABN , First Publish Date - 2023-12-12T20:19:39+05:30 IST

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సోమవారం నాడు పరామర్శించారు.

KA Paul : కేసీఆర్ కోసం ఏసుప్రభువుని ప్రార్థించా

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సోమవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా కేఏపాల్ మాట్లాడుతూ...‘‘కేసీఆర్ ఇంత త్వరగా కోలుకోవడం మంచి పరిణామం. కోకొనట్ ఆయిల్ తెచ్చి కేసీఆర్ కోలుకోవాలని ఏసుప్రభువుకి ప్రార్థన చేశాను. కేసీఆర్ స్పిరిచ్యూవల్ పర్సన్. రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కేసీఆర్ కోలుకోవాలని కోరుకుంటున్నారు. త్వరలోనే కేసీఆర్ ప్రజల మధ్యలకు రావాలని ప్రేయర్ చేశాను’’ అని కేఏ పాల్ తెలిపారు.

Updated Date - 2023-12-12T20:19:40+05:30 IST