komatireddy: పదవులపై ఇంట్రెస్ట్ లేదు.. పవర్‌లోకి తీసుకురావడమే లక్ష్యం

ABN , First Publish Date - 2023-09-29T14:38:28+05:30 IST

చేపల పేరు మీద తలసాని శ్రీనివాస్ యాదవ్ కోట్ల రూపాయలు సంపాదించారు. షర్మిల డెడ్ లైన్ ఏం లేదు. కాంగ్రెస్‌కి డెడ్ లైన్లు పెడతారా?

komatireddy: పదవులపై ఇంట్రెస్ట్ లేదు.. పవర్‌లోకి తీసుకురావడమే లక్ష్యం

హైదరాబాద్: ముఖ్యమంత్రి, మంత్రి పదవులపై తనకు ఇంట్రెస్ట్ లేదని... కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) స్పష్టం చేశారు. కోమటిరెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. తెలంగాణలో వంద శాతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. తుక్కుగూడ సభ తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. కాంగ్రెస్ గెలుస్తుందని మౌత్ టాక్ మొదలైంది. దాన్ని ఎవరూ ఆపలేరు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా కేటీఆర్ కొన్ని వీడియోలను తయారు చేయించాడు. అవి వైరల్ చేయిస్తున్నారు. కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజుల్లా ఫీల్ అవుతున్నారు. చేపల పేరు మీద తలసాని శ్రీనివాస్ యాదవ్ కోట్ల రూపాయలు సంపాదించారు. షర్మిల డెడ్ లైన్ ఏం లేదు. కాంగ్రెస్‌కి డెడ్ లైన్లు పెడతారా?, మోదీ తెలంగాణ పర్యటనతో బీజేపీకి వచ్చే లాభం లేదు. నా ప్రాణం పోయినా నాది కాంగ్రెస్ పార్టీనే. బీజేపీలో ఉన్న మాజీ ఎంపీలు కాంగ్రెస్‌లోకి ఎవరు రారు.’’ అని తెలిపారు.

Updated Date - 2023-09-29T14:38:28+05:30 IST