TS NEWS: సింగర్​ సాయిచంద్‌ భార్యకు కోటి రూపాయల చెక్ అందజేత

ABN , First Publish Date - 2023-08-28T23:38:45+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు దివంగత సాయిచంద్ (Singer Saichand)భార్య రజినికి బీఆర్ఎస్ పార్టీ తరుపున రూ.కోటి చెక్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్, జెడ్పీ చైర్ పర్సన్ అనితరెడ్డి అందజేశారు.

TS NEWS: సింగర్​ సాయిచంద్‌ భార్యకు కోటి రూపాయల  చెక్  అందజేత

సరూర్ నగర్(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు దివంగత సాయిచంద్ (Singer Saichand)భార్య రజినికి బీఆర్ఎస్ పార్టీ తరుపున రూ.కోటి చెక్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్, జెడ్పీ చైర్ పర్సన్ అనితరెడ్డి అందజేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడలో దివంగత మాజీ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ కుటుంబ సభ్యులను నేతలు పరామర్శించి కోటి రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా సాయిచంద్ నిలిచారన్నారు.సాయిచంద్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం కోటి యాభై లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-08-28T23:38:45+05:30 IST