Share News

Vijayashanti: కాంగ్రెస్ పార్టీపై రాములమ్మ సోషల్ మీడియాలో ఏం చర్చించారంటే..

ABN , First Publish Date - 2023-11-01T21:50:40+05:30 IST

బీఆర్ఎస్ దుర్మార్గాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోడానికి కాంగ్రెస్ పార్టీ నుంచే పోరాడాలి అని బీజేపీ పార్టీ సీనియర్ నేత విజయశాంతి ( Vijayashanti ) అన్నారు.

Vijayashanti: కాంగ్రెస్ పార్టీపై రాములమ్మ సోషల్ మీడియాలో ఏం చర్చించారంటే..

హైదరాబాద్: బీఆర్ఎస్ దుర్మార్గాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోడానికి కాంగ్రెస్ పార్టీ నుంచే పోరాడాలి అని బీజేపీ పార్టీ సీనియర్ నేత విజయశాంతి ( Vijayashanti ) అన్నారు. బుధవారం నాడు బీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఏడేళ్ల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా మోసిన వ్యక్తి రాములమ్మ అని కొందరు.. బీజేపీని విధాన పూర్వకంగా 1998 నుంచి విశ్వసించి దక్షిణ భారతంతో పాటు మిగతా అనేక రాష్ట్రాలల్లో దశాబ్ధ కాలం పైగా పనిచేసిన నేతగా, స్పష్టమైన హిందూత్వవాదిగా బీజేపీ వైపు నిలబడాలని మరెంతో మంది బిడ్డలు ఇంకోవైపు... రెండు అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోబడ్డవే. నిజానికి ఇయ్యాల తెలంగాణాల ఉన్న దుర్మార్గ కేసీఆర్ పరిపాలన పరిస్థితుల నుంచి కొట్లాడిన మన ఉద్యమకారులం తెచ్చుకున్న రాష్ట్రానికి మేలు కొరకు మాత్రమే ఐనా.. సినిమా తీరుగా పోలీస్ లాకప్, రౌడీ దర్బార్, నాయుడమ్మ లెక్క ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాలలో సాధ్యపడదు. ఏదైనా ఒక పార్టీ కి మాత్రమే పని చేయగలుగుతాం’’ అని రాములమ్మ తెలిపారు. హర హర మహాదేవ జై శ్రీరామ్ జై తెలంగాణ అని సోషల్ మీడియాలో నినాదించారు.

Updated Date - 2023-11-01T21:50:40+05:30 IST