Share News

Thalasani Srinivas: చంద్రబాబుపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం సరికాదు

ABN , First Publish Date - 2023-11-18T20:41:37+05:30 IST

అమీర్‌పేటలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి NTR విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Thalasani Srinivas ) తెలిపారు.

Thalasani Srinivas:  చంద్రబాబుపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం సరికాదు

హైదరాబాద్: అమీర్‌పేటలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి NTR విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Thalasani Srinivas ) తెలిపారు. శనివారం నాడు అమీర్‌పేట మోడల్ కాలనీలో కమ్మ వారి సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని పాల్గొని మాట్లాడుతూ..‘‘1994లో ఎన్టీఆర్ నాటిన మొక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు వృక్షంగా అభివృద్ధి చెందింది. నాకు రాజకీయ జీవితం ప్రసాదించిన మహనీయులు ఎన్టీఆర్‌ను ఎప్పుడు మరువను. ఎన్టీఆర్ నా గుండెల్లో ఉంటాడు ఎప్పుడు మరువను. నాకు రాజకీయ భిక్షత్ పెట్టిన మహనీయుడు ఎన్టీఆర్. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబునాయుడు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. నేడు అధికారంలో ఉన్నామని చంద్రబాబుపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం సరికాదు’’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Updated Date - 2023-11-18T20:41:39+05:30 IST