Share News

Congress: మరికాసేపట్లో రాజ్ భవన్‌కు రేవంత్‌రెడ్డి బృందం

ABN , First Publish Date - 2023-12-03T21:28:22+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. దీంతో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అందజేయనున్నది. ఈ మేరకు వారు రాజ్‌భవన్‌కు బయలు దేరి వెళ్లారు.

Congress: మరికాసేపట్లో రాజ్ భవన్‌కు రేవంత్‌రెడ్డి బృందం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. దీంతో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అందజేయనున్నది. ఈ మేరకు వారు రాజ్‌భవన్‌కు బయలు దేరి వెళ్లారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన వారిలోరేవంత్‌రెడ్డి, తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. కాగా రేపు ఉదయం 9.30 గంటలకు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులతో సీఎల్పీ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - 2023-12-03T21:28:26+05:30 IST