Share News

Pawan Kalyan: మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత

ABN , First Publish Date - 2023-11-23T13:48:24+05:30 IST

తాను తెలంగాణ లో తిరగక పోయినా జనసేన ఉందంటే అది మీ అభిమానమేనని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నేడు కొత్తగూడెం ప్రకాశం గ్రౌండ్స్‌లో బిజేపీ, జనసేన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడుతూ.. ...వైఎస్ రాజశేఖర్ రెడ్డి జల యజ్ఞం దోపిడీ వల్లే తెలంగాణ పోరాటానికి పునాది పడిందని పేర్కొన్నారు. కౌలు రైతులను... రైతులు కాదనడం బాగో లేదన్నారు. ధరణిలో లోపాలున్నాయన్నారు. అభివృద్ధి ఆంధ్రాలో జరగకపోతే తెలంగాణ యువత నష్ట పోతుందన్నారు. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత అని.. పారిపోరు జెండా పట్టుకుని నిలబడతారని పవన్ పేర్కొన్నారు.

Pawan Kalyan: మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత

భద్రాద్రి కొత్తగూడెం: తాను తెలంగాణలో తిరగక పోయినా జనసేన ఉందంటే అది మీ అభిమానమేనని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గురువారం కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం గ్రౌండ్స్‌లో బిజేపీ-జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం దోపిడీ వల్లే తెలంగాణ పోరాటానికి పునాది పడిందని వ్యాఖ్యానించారు. కౌలు రైతులను రైతులు కాదనడం బాగో లేదన్నారు. ధరణిలో లోపాలున్నాయని విమర్శించారు. అభివృద్ధి ఆంధ్రాలో జరగకపోతే తెలంగాణ యువత నష్ట పోతుందన్నారు. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత అని, పారిపోరుకుండా జెండా పట్టుకుని నిలబడతారని పవన్ అన్నారు.

‘‘శివ అనే 16 ఏళ్ల చెంచు కుర్రాడు యురేనియం తవ్వకాలపై నన్ను కలిశాడు. తెలంగాణ యువత నిప్పు కణిక అనడానికి శివ నిదర్శనం. నా తెలంగాణ కోటి రతణాల వీణ అన్న.. దాశరథీ కృష్టమాచార్యులు నాకు స్ఫూర్తి. సనాతన ధర్మం.. సోషలిజం రెండూ నడప గలిగేది జనసేన. బీఆర్ఎస్‌ని ఒక్కమాట అనక పోవడానికి కారణం నేను ఇక్కడ తిరగక పోవడం. దశాబ్దం వేచి చూశా. ఆంధ్రాలో అరాచకంపై పోరాటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాకు స్ఫూర్తి. తెలంగాణలో అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటుంది. మోదీ నాయకత్వ పటిమ నచ్చి ఆయనకు మద్దతుగా ఉన్నా. ఎవ్వరు వచ్చినా రాక పోయినా దక్షిణాది నుంచి మోదీకి మద్దతుగా ఉంటానని గుజరాత్ వెళ్లి కలిశా. భవిష్యత్తు యువత అని చెప్పిన గద్దర్‌కు జోహార్లు. నిధులు, నీళ్ళు, నియామకాలు నినాదంతో వచ్చిన తెలంగాణ అనుకున్న స్థాయిలో లేదు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేయగలిగేది మోదీ మాత్రమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎన్నికల వాతావరణం అవాంఛనీయం. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. సింగరేణిలో ఉద్యోగాలు రావాలన్నా పేపర్ లీక్స్ లేకుండా ఉండాలంటే బీజేపీ రావాలి’’ అని పవన్ పేర్కొన్నారు.


భవిష్యత్తు యువత అని చెప్పిన గద్దర్‌కు జోహార్లని పవన్ అన్నారు. నిధులు నీళ్ళు నియామకాలు నినాదంతో వచ్చిన తెలంగాణలో అనుకున్న స్థాయిలో లేదని విమర్శించారు. తెలంగాణలో బీసీ నేతను ముఖ్యమంత్రి చేయగలిగేది మోదీ మాత్రమేనని, రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఎన్నికల వాతావరణం అవాంఛనీయమని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆయన ఆకాంక్షించారు. సింగరేణిలో ఉద్యోగాలు రావాలన్నా పేపర్ లీక్స్ లేకుండా ఉండాలంటే బిజేపి రావాలన్నారు.

Updated Date - 2023-11-23T14:06:20+05:30 IST