Share News

KTR: ఆడబిడ్డ ఉసురు మంచిది కాదు.. బీజేపీకి డిపాజిట్లు రావు

ABN , First Publish Date - 2023-11-15T14:16:53+05:30 IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా కథలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి లక్ష్మీ నరసింహరావు పాల్గొన్నారు.

KTR: ఆడబిడ్డ ఉసురు మంచిది కాదు.. బీజేపీకి డిపాజిట్లు రావు

జగిత్యాల: ఎన్నికల ప్రచారంలో భాగంగా కథలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR), వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి లక్ష్మీ నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సంక్రాంతికి వచ్చే గంగిరెద్దొళ్ళు ప్రతిపక్షాలు అంటూ విరుచుకుపడ్డారు. బీడీలు చేసే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తానని.. పేదలను కడుపులో పెట్టుకుని చూసే పార్టీ బీఆర్ఎస్ (BRS) అని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాల తియ్యటి, పుల్లటి మాటలకు ఓట్లేయ్యకండన్నారు. అల్లం, బెల్లం అంటూ మోదీ (PM Modi) మాయమాటలు చెప్పారని విమర్శించారు. ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు జరిగే యుద్ధం తెలంగాణ ఎన్నికలన్నారు. బక్కపలచని కేసీఆర్ (CM KCR) కోసం ముప్పై మంది ముఖ్యమంత్రులు వస్తున్నారన్నారు. ఢిల్లీ పెత్తనం మనకు అవసరమా అని ప్రశ్నించారు. కలికోట సూరమ్మ చెరువు రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డ ఉసురు మంచిది కాదని.. తుల ఉమకు అన్యాయం చేసిన బీజేపీకి డిపాజిట్లు రావన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దరిద్రం కొని తెచ్చుకున్నట్టే అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-11-15T14:16:54+05:30 IST