Share News

KCR : బెడ్‌పై నుంచి కేసీఆర్ సందేశం.. ఏం చెప్పారంటే..?

ABN , First Publish Date - 2023-12-12T16:59:23+05:30 IST

అభిమానులు, పార్టీ నేతలు యశోద ఆస్పత్రికి రావద్దని దయచేసి సహకరించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ఓ వీడియోలో సందేశం ఇచ్చారు.

KCR : బెడ్‌పై నుంచి కేసీఆర్ సందేశం.. ఏం చెప్పారంటే..?

హైదరాబాద్: అభిమానులు, పార్టీ నేతలు యశోద ఆస్పత్రికి రావద్దని దయచేసి సహకరించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ఓ వీడియోలో సందేశం ఇచ్చారు. వీడియోలో కేసీఆర్ ఏం చెప్పారంటే... ‘‘నాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదు. త్వరలోనే కోలుకుని మీమధ్యకు వస్తాను. ఇన్ఫె‌క్షన్ వస్తుందని డాక్టర్లు నన్ను బయటకు పంపడంలేదు. నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని.. అప్పడిదాకా సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దు’’ అని కేసీఆర్ సూచించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రత్యేకంగా ఓ వీడియోను కేసీఆర్ విడుదల చేశారు.

Updated Date - 2023-12-12T17:18:06+05:30 IST