Share News

Telangana Polls : ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్.. సీనియర్ నేత కన్నుమూత!

ABN , First Publish Date - 2023-11-13T09:37:44+05:30 IST

Telangana Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.!

Telangana Polls : ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్.. సీనియర్ నేత కన్నుమూత!

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.! కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ శీలం ప్రభాకర్ మృతిచెందారు. గతవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన శీలం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తమ అభిమాన నాయకుడు త్వరగా కోలుకొని తిరిగొస్తాడనుకున్న అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు.. ఆయన మరణించారన్న వార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు.. శీలం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. మంగళవారం నాడు శీలం అంత్యక్రియలు జరుగుతాయని అనుచరులు చెబుతున్నారు.

Updated Date - 2023-11-13T09:37:49+05:30 IST