Share News

Flipkart Big Dusshera sale: ఈ టాప్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఓ లుక్కేయండి బాస్!

ABN , First Publish Date - 2023-10-24T20:52:48+05:30 IST

ఫ్లిప్‌కార్టు బిగ్ బిలియన్ డేస్(flipkart big billion days) ఇలా ముగిసిందో లేదో వెంటనే ఫ్లిప్‌కార్టు బిగ్ దసరా సేల్(Flipkart Big Dusshera sale) ప్రారంభమైంది. దీంతో విజయదశమి(vijayadashami) సందర్భంగా దసరా(Dusshera) సెలవుల్లో ఆన్‌లైన్ షాపింగ్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.

Flipkart Big Dusshera sale: ఈ టాప్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఓ లుక్కేయండి బాస్!

ఫ్లిప్‌కార్టు బిగ్ బిలియన్ డేస్(flipkart big billion days) ఇలా ముగిసిందో లేదో వెంటనే ఫ్లిప్‌కార్టు బిగ్ దసరా సేల్(Flipkart Big Dusshera sale) ప్రారంభమైంది. దీంతో విజయదశమి(vijayadashami) సందర్భంగా దసరా(Dusshera) సెలవుల్లో ఆన్‌లైన్ షాపింగ్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. బిగ్ బిలియన్ డేస్‌లో షాపింగ్ చేయలేకపోయినవారికి ఇది మరో మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన దసరా సేల్ ఈ నెల 29వ వరకు కొనసాగనుంది. దసరా సేల్‌లో కూడా అనేక టాప్ మొబైల్స్‌పై ఫ్లిప్‌కార్టు(flipkart) భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ముఖ్యంగా ఐ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54, పోకో సీ51, మోటరోలా ఎడ్జ్ 40 మొబైల్స్‌ను తగ్గింపు ధరలకే ఫ్లిప్‌కార్టు అందిస్తోంది. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్‌లో భాగంగా రూ.69,900 విలువైన ఐఫోన్ 14 ( iPhone 14 )మొబైల్‌ను రూ. 56,999 పొందొచ్చు. దాదాపు రూ.13 వేల తక్కువ ధరకే పొందొచ్చు. అలాగే 10 శాతం బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. మీ దగ్గర కోటక్, ఆర్‌బీఎల్, ఎస్బీఐ క్రెడిట్ కార్టులు ఉంటే ఈ 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అప్పుడు ఐఫోన్ 14 మొబైల్ మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54(Samsung Galaxy F54) మొబైల్స్‌ను డిస్కౌంట్‌లో రూ.24,999 రూపాయలకే దక్కించుకోవచ్చు. దీనికి కూడా కోటక్, ఎస్సీఐ, ఆర్బీఎల్ క్రెడిట్ కార్టులపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.


పిక్సల్ 7ఏ మొబైల్ ఫోన్ కూడా ఈ బిగ్ దసరా సేల్‌లో తక్కువ ధరకే లభిస్తోంది. సాధారణ రోజుల్లో ఉండే ధర కన్నా ఈ ఫోన్‌ను రూ.8 వేలు తక్కువకే పొందొచ్చు. సాధారణంగా పిక్సల్ 7ఏ(Pixel 7a) మొబైల్ ఫోన్ ధర రూ.43,999గా ఉంటుంది. కానీ దసరా సేల్‌లో 35,999కే పొందొచ్చు. ఈ మొబైల్స్‌పై కూడా ఆయా బ్యాంకు క్రెడిట్ కార్టులపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇక మోటరోలా ఎడ్జ్ 40(Motorola Edge 40) మొబైల్‌ను రూ.22,999 ధరకు, నథింగ్ ఫోన్ (2)ను(Nothing Phone (2) ) రూ.39,999కు ఈ సేల్‌లో పొందొచ్చు. డిస్కౌంట్‌లో పోకో ఎక్స్5 ప్రో(Poco X5 Pro) మొబైల్‌ను రూ.18,499కి, రెడ్‌మీ నోట్ 12 ప్రో(Redmi Note 12 Pro) మొబైల్‌ను 21,999 ధరకే కొనుగోలు చేయొచ్చు. అయితే 10 వేల లోపు ధరకే మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి పోకో సీ51( Poco C51) మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇదే మాడల్ ఫోన్ రూ.8,499కి కూడా అందుబాటులో ఉంది. కాగా ఈ ఫోన్‌లన్నింటిలోని ఫీచర్లను బట్టి వినియోగదారులు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే ధర కూడా ముఖ్యమనే చెప్పుకోవాలి. మంచి కెమెరా పని తీరు కోరుకునే వారికి పిక్సల్ 7ఏ మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. అలాగే మంచి డిజైన్, స్పెక్స్‌తో కూడిన ఫీచర్లు కోరుకునే వారికి మోటరోలా ఎడ్జ్ 40 మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. మొత్తంగా వినియోగదారులు తమకు కావాల్సిన ఫీచర్లు, తమ దగ్గర ఉన్న డబ్బులను బట్టి నచ్చిన మొబైల్స్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్ ఈ నెల 29తో ముగియనుందనే విషయం గమనార్హం.

Updated Date - 2023-10-24T20:52:48+05:30 IST