WPL 2023: ప్రాధాన్యం లేని మ్యాచ్‌లో పరువు కోసం తలపడుతున్న బెంగళూరు

ABN , First Publish Date - 2023-03-21T16:17:52+05:30 IST

మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023)లో భాగంగా ముంబై ఇండియన్స్(Mumbai Indians)-రాయల్

WPL 2023: ప్రాధాన్యం లేని మ్యాచ్‌లో పరువు కోసం తలపడుతున్న బెంగళూరు

ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023)లో భాగంగా ముంబై ఇండియన్స్(Mumbai Indians)-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challenger Bangalore) జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడిన బెంగళూరు బ్యాటింగ్ చేస్తోంది. ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా, ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడిన బెంగళూరు జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ముంబై కనుక గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు షరామామూలుగానే పేలవంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ సోఫియా డివైన్(0) రనౌట్ అయింది. కెప్టెన్ స్మృతి మంధాన మెరుపులు మెరిపించినప్పటికీ క్రీజులో కుదురుకోలేకపోయింది. 25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 24 పరుగులు చేసి అమెలియా కెర్ బౌలింగ్‌లో యస్తికా భాటియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిశాయి. బెంగళూరు రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ఎల్లిస్ పెర్రీ 20, హెదర్‌నైట్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-03-21T16:17:52+05:30 IST