Urvashi Rautela: పంత్ త్వరగా కోలుకోవాలన్న ఊర్వశీ రౌతేలా తల్లి.. విరుచుకుపడుతున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2023-01-03T21:04:24+05:30 IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్‌ రిషభ్ పంత్

Urvashi Rautela: పంత్ త్వరగా కోలుకోవాలన్న ఊర్వశీ రౌతేలా తల్లి.. విరుచుకుపడుతున్న నెటిజన్లు
Urvashi Rautela

డెహ్రాడూన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్‌ రిషభ్ పంత్ (Rishabh Pant) ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు, క్రికెటర్లు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela) తల్లి మీరా రౌతేలా (Meera Rautela) కూడా పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

ఆ పోస్టు చూసిన పంత్ అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పంత్‌ను ఉద్దేశించి ఊర్వశి గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంత్‌ను అల్లుడిగా సంబోధించాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. నెటిజన్లు ఆగ్రహానికి కూడా ఓ కారణం ఉంది.

గతంలో ఊర్వశి ఓ పోస్టు షేర్ చేస్తూ తనను కలిసేందుకు ‘ఆర్‌పీ’(RP) ఓ హోటల్‌లో గంటలపాటు వేచి చూశాడని పేర్కొంది. ఆమె ఆర్‌పీ అని పేర్కొనడంతో.. ఆమె కోసం వెయిట్ చేసింది పంతేనని వార్తలొచ్చాయి. దీంతో స్పందించిన పంత్ ఆమె వ్యాఖ్యలను కొట్టిపడేశాడు. అయితే, ఆర్‌పీ అంటే మరెవరినో కాదని, టాలీవుడ్ నటుడు ‘రామ్ పోతినేని’ అని తర్వాత తెలిసింది.

కాగా, ఊర్వశీ రౌతేలా తెలుగులో చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’(Waltair Veerayya) సినిమాలో నటించింది. ఈ సినిమాలో ‘బాస్ పార్టీ’ అనే ఓ ప్రత్యేక గీతంలో చిరంజీవి సరసన స్టెప్పులేసింది. జనవరి 13న ఈ సినిమా విడుదల కానుంది. ‘బాస్ పార్టీ’ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇప్పటికే 39 మిలియన్లకుపైగా కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది.

Updated Date - 2023-01-03T21:04:26+05:30 IST