Viral Video: కుర్రాడిని కాపాడడం కోసం రిస్క్ చేసిన విండీస్ కెప్టెన్.. వైరల్ అవుతున్న వీడియో!
ABN , First Publish Date - 2023-03-27T20:54:05+05:30 IST
క్రికెట్ను జెంటిల్మెన్ గేమ్ అని కూడా పిలుస్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అది నిజమేననిపిస్తుంది. బౌండరీ అవతల ఉన్న ఇద్దరు పిల్లలను కాపాడడం కోసం వెస్టిండీస్ కెప్టెన్ రోవ్మాన్ పావెల్ తన ప్రాణాలనే పణంగా పెట్టాడు.
క్రికెట్ను (Cricket) జెంటిల్మెన్ గేమ్ అని కూడా పిలుస్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అది నిజమేననిపిస్తుంది. బౌండరీ అవతల ఉన్న ఇద్దరు పిల్లలను కాపాడడం కోసం వెస్టిండీస్ కెప్టెన్ రోవ్మాన్ పావెల్ (West Indies captain) తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. పిల్లలను కాపాడి తను గాయాల పాలయ్యాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆదివారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఐదు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దక్షిణాఫ్రికా (South Africa) ఏడు బంతులు ఉండగానే భారీ లక్ష్యాన్ని సాధించి ప్రపంచ రికార్డు విజయం సాధించింది. కాగా, మ్యాచ్ ఓడిపోయినా విండీస్ కెప్టెన్ పావెల్ (Rovman Powell) మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ కొట్టిన షాట్తో బంతి బౌండరీకి వెళ్తుండగా.. దానిని ఆపేందుకు పావెల్ పరుగుపెట్టాడు. బాల్ బౌండరీ లైన్ దాటేసింది. వేగంగా పరిగెడుతున్న పావెల్ నియంత్రణ కోల్పోయాడు.
Amazing Bullet Bike: ఈ బైక్కు పెట్రోల్ అస్సలు అవసరం లేదు.. ఇందులోని ప్రతీ పార్టును దేనితో తయారు చేశారో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!
బౌండరీ అవతల ఇద్దరు పిల్లలు బాల్ బాయ్స్గా (Ball Boys) ఉన్నారు. తాను వారి మీద పడితే వారికి ఎక్కడ గాయాలు అవుతాయోనని, వారిని తప్పించుకుని బౌండరీ లైన్ బయట పెట్టిన ఎల్ఈడీ బోర్డుల పైకి ఎక్కేశాడు. అక్కడితో కూడా ఆగకుండా ఫెన్సింగ్పై పడిపోయాడు. ఈ ఘటనలో పావెల్కు గాయాలయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పిల్లలను కాపాడిన పావెల్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.