Viral News: పొరిగింటి వారిని ఖాళీ చేయించేందుకు మహిళ ప్లాన్.. రోజూ రాత్రిళ్లు ఎవరికీ తెలీకుండా ఆమె చేసిన పని.. చివరకు..

ABN , First Publish Date - 2023-05-11T19:00:22+05:30 IST

ఇరుగుపొరుగున ఉండే కుటుంబాల మధ్య ఒక్కోసారి విచిత్రమైన సమస్యలు తలెత్తుతుంటాయి. ప్రధానంగా మహిళల వల్లే రోజూ ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మహిళల గొడవలకు గల కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి. ఇలాంటి..

Viral News: పొరిగింటి వారిని ఖాళీ చేయించేందుకు మహిళ ప్లాన్.. రోజూ రాత్రిళ్లు ఎవరికీ తెలీకుండా ఆమె చేసిన పని.. చివరకు..

ఇరుగుపొరుగున ఉండే కుటుంబాల మధ్య ఒక్కోసారి విచిత్రమైన సమస్యలు తలెత్తుతుంటాయి. ప్రధానంగా మహిళల వల్లే రోజూ ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మహిళల గొడవలకు గల కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ మహిళ చేసిన నిర్వాకానికి సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పొరిగింటి వారిని ఖాళీ చేయించేందుకు ఓ మహిళ నీచమైన పనికి పాల్పడింది. చివరకు సీసీ కెమెరాలు పరిశీలించగా విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఇండోనేషియాలో (Indonesia) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల మహిళ (woman) .. భర్త, పిల్లలతో కలిసి ఉంటోంది. వీరి ఇంటికి పక్కనే ఉన్న ఇంట్లో ఆమె సోదరి కుటుంబం ఉంటోంది. ఇదిలావుండగా, ఇటీవల చెల్లెలు కుటుంబం ఇంటిని ఖాళీ చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఖాళీ చేసిన కొన్నాళ్లకు ఆ ఇంటిని వేరే వాళ్లకు విక్రయించారు. అయితే సోదరి ఇంటిని పరాయి వాళ్లకు విక్రయించడం అక్కకు నచ్చలేదు. ఎలాగైనా ఆ ఇంటిని సొంతం చేసుకోవాలని రోజూ ఆలోచించేంది. ముందుగా అందులో ఉంటున్న వారిని ఖాళీ చేయించి, తర్వాత ఇంటిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం నీచమైన పని చేసేందుకు సిద్ధపడింది.

Viral Video: అరటి పండ్ల లోడుతో వచ్చిన బాలుడు.. ఒక్కసారిగా చుట్టుముట్టిన జనం.. అంతా చూస్తుండగానే..

రోజూ రాత్రిళ్లు ఎవరూ లేని సమయంలో పాత్రలో మూత్రాన్ని తీసుకొచ్చి, పక్కింటి ఆవరణలో పడేస్తూ వచ్చింది. అలాగే చెత్తాచెదారం కూడా పడేసేది. రోజూ ఉదయాన్నే ఇంటి ముందు చెత్తాచెదారంతో తీవ్ర దర్వాసన వస్తుండడంతో సదరు ఇంట్లోని వారికి ఏమీ అర్థం కాలేదు. అయితే రోజూ ఇలాగే జరుగుతుండడంతో అనుమానం కలిగింది. ఓ రోజు ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా విషయం బయటపడింది. చివరకు గ్రామ పెద్దలు కలుగజేసుకుని నచ్చజెప్పినా.. సదరు మహిళ ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే ఈ విషయంలో బాధిత కుటంబం ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయం తెలియరాలేదు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral news) అవుతోంది. నీచమైన పనికి పాల్పడిన మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral News: ట్రాఫిక్ చలాన్ కట్టమంటూ భార్య ఫోన్‌కు మెసేజ్.. అందులో బైకు నడుపుతున్న భర్త ఫొటో చూసి షాక్.. చివరకు పోలీస్ స్టేషన్‪‌కు వెళ్లడంతో..

Updated Date - 2023-05-11T19:00:22+05:30 IST