Home » Indonesia
ఇండోనేషియాలోని మొలుక్కా సముద్ర తీర ప్రాంతంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4 గా నమోదైంది. సముద్ర మట్టాల్లో మార్పులు రావడంతో తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ తర్వాత ఉపసంహరించుకున్నారు.
గురువారం తెల్లవారుజామున ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో సముద్రం అడుగున భూమి కంపించింది.
నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉంటోంది. సోషల్ మీడియా వ్యసనం వల్ల కలిగే ఒత్తిడి, ఆందోళనల నుంచి పిల్లలను రక్షించడమే ప్రధాన లక్ష్యంగా ఇండోనేషియా ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్టు యూజీజీఎస్ పేర్కొంది.
ఎక్స్ఏఐ సంస్థకు చెందిన గ్రోక్ చాట్బాట్పై ఇండోనేషియా ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వృద్ధాశ్రమంలో మంటలు చెలరేగిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటికే తీవ్ర వరదలతో సతమతమవుతున్న సుమత్రా దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. ఇండోనేషియా, 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉండటంతో భూకంపాలు, తుఫానులు, వర్షాలు తరచూ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
టోరజా జాతి వారు శవాలను మమ్మీలుగా మార్చి ఇంట్లోనే దాచుకుంటారు. వారు ఇంకా బతికే ఉన్నట్లు భావిస్తారు. శవాలతో అప్పుడప్పుడు మాట్లాడతారు. వారి కోసం కొంత ఆహారాన్ని పక్కకు తీసిపెడతారు.
అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైన హిందూ దేవుడు విష్ణుమూర్తి విగ్రహం ఉందని మీకు తెలుసా.. అదీ భారత దేశంలో కాదు. ఇది ఇండోనేషియా దేశంలో ఉంది. బాలిలోని గరుడ విష్ణు కెంచన విగ్రహం ఒక సాంస్కృతిక అద్భుతం.
మౌలానా అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి రైల్వే ట్రాక్స్ పైకి వెళ్లాడు. మౌలానా తన చేతిలో జెండా పట్టుకుని రైల్వే ట్రాక్స్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. దూరంగా ఉన్న అతడి స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..