Newly Married Couple: శోభనం గదిలోంచి ఎంతకూ బయటకు రాని కొత్త పెళ్లి జంట.. మొదట్లో పట్టించుకోని బంధువులు.. చివరకు షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2023-06-02T17:40:29+05:30 IST

కొత్త దంపతులిద్దర్నీ శోభనం గదిలోకి పంపించి అందరూ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారిసరేకి

Newly Married Couple: శోభనం గదిలోంచి ఎంతకూ బయటకు రాని కొత్త పెళ్లి జంట.. మొదట్లో పట్టించుకోని బంధువులు.. చివరకు షాకింగ్ సీన్..!
Newly Married Couple

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకుంటారు. అందుకే ప్రతీ ఒక్కరూ చాలా గ్రాండ్ చేస్తుంటారు. అలాగే పెళ్లి చేసుకునే అబ్బాయి-అమ్మాయి కూడా చాలా సంతోషంగా ఉంటారు. కొత్త జీవతంలోకి అడుగుపెడుతున్నామన్న ఆనందంలో ఉంటారు. ఆ పెద్దలు కూడా చాలా అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేశారు. కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేశారో.. అలాగే తొలి రాత్రికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అంతే గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. కొత్త దంపతులిద్దర్నీ శోభనం గదిలోకి పంపించి అందరూ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారిసరేకి విషాదఛాయలు అలుముకున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బహ్రైచ్‌ కైసర్‌గంజ్‌లో నివాసముంటున్న ప్రతాప్‌(23)కు.. గుల్లన్‌పూర్వా గ్రామానికి చెందిన పుష్పయాదవ్‌(21)తో మే 30న (మంగళవారం) వివాహం జరిగింది. అన్ని లాంఛనాలతో వివాహ వేడుక పూర్తయింది. ఆ తర్వాత బుధవారం వరుడు.. వధువుతో కలిసి ఇంటికి వచ్చాడు. కొత్త కోడలుకు ఘనంగా స్వాగతం పలికారు.

sksk.jpg

వివాహానంతర కార్యక్రమాలన్నీ ముగించుకుని కొత్తగా పెళ్లయిన జంట శోభనం కోసం పడకగదికి వెళ్లారు. తెల్లారి చూసేసరికి శవాలుగా మారిపోయారు. తొలిరాత్రి కోసం గదిలోకి వెళ్లిన కొత్త జంట అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆనందోత్సవాలతో జరుపుకున్న పెళ్లింట ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. కొడుకు, కోడలు మృతదేహాలను (Newly Married Couple) చూసి ఇంట్లో వారంతా కన్నీరుమున్నీరు అయ్యారు. అంతే కాదు ఈ ఘటనతో గ్రామస్తులు కూడా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను (found dead) స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

వివాహ వేడుకలో అలసిపోవడంతో దంపతులు ఆలస్యంగా నిద్రపోయి ఉంటారని కుటుంబ సభ్యులు తొలుత భావించారు. అందుకే మొదట్లో కుటుంబ సభ్యులెవరూ పెద్దగా వారిని పట్టించుకోలేదు. అయితే చాలా సేపటికి తలుపులు తెరుచుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది గది తలుపు తట్టారు. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై కిటికీలోంచి చూసే సరికి పుష్ప, ప్రతాప్ మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి గదిలోకి వెళ్లి చూడగా ఇద్దరూ శవాలై కనిపించారు. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మిస్టరీ వీడనుంది.

ఇది కూడా చదవండి: Woman Kisses Snake: ఈ యువతి ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిపోయింది.. పామును ముద్దు పెట్టుకున్న మరుక్షణంలోనే..!

ఇది కూడా చదవండి: Wife: మీ భార్య గురించి ఈ నిజం తెలుసా..? అంటూ స్నేహితుడి భార్య చెప్పిన విషయాలు విని విస్తుపోయిన భర్త.. చివరకు జరిగింది ఇదీ..!

Updated Date - 2023-06-02T17:40:29+05:30 IST