Marriage: వయసులో 13 ఏళ్లు చిన్న అయినా ఏరికోరి మరీ అతడినే పెళ్లాడిన 35 ఏళ్ల మహిళ.. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏంటంటే..!

ABN , First Publish Date - 2023-05-22T19:56:55+05:30 IST

తన కంటే చిన్నవాడని తెలిసీ ఆమె అతడిని ప్రేమించింది. అతనూ ఆమెను ఇష్టపడటంతో వారిద్దరి వివాహం సంతోషంగా జరిగిపోయింది. కానీ ఆ తరువాత

Marriage: వయసులో 13 ఏళ్లు చిన్న అయినా ఏరికోరి మరీ అతడినే పెళ్లాడిన 35 ఏళ్ల మహిళ.. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏంటంటే..!

ప్రేమ మనుషులను ఏమీ ఆలోచించనివ్వదు. ఆర్థిక స్థాయిలే కాదు, వయసు తారతమ్యాలు కూడా ప్రేమకు వర్తించవని చాలా సంఘటనలు రుజువుచేస్తున్నాయి. 35ఏళ్ళ మహిళకు 22ఏళ్ళ కుర్రాడు పరిచయమయ్యాడు. అతను ఆమె కంటే 13ఏళ్ళు చిన్నవాడు. తన కంటే చిన్నవాడని తెలిసీ ఆమె అతడిని ప్రేమించింది. అతనూ ఆమెను ఇష్టపడటంతో వారిద్దరి వివాహం సంతోషంగా జరిగిపోయింది. కానీ ఆ తరువాత ఎవరూ ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. అందరినీ షాక్ లోకి నెట్టేసే ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే.

ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం గ్రేటర్ నోయిడాకు(Greater Noida) చెందిన 35ఏళ్ళ సాయిబా అనే మహిళకు ఇన్స్టాగ్రామ్(Instagram) లో 22ఏళ్ళ జితేంద్ర భట్టీ అనే కుర్రాడు పరిచయం అయ్యాడు. వారిద్దరూ మొదట స్నేహంగా ఉండేవారు. క్రమంగా చనువు పెరిగి ప్రేమకు దారితీసింది. ఇద్దరికీ ఇష్టం ఉండటంతో వారిద్దరూ పారిపోయి పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి తరువాత సాయిబా తన పేరును జాన్వీగా మార్చుకుంది. వారిద్దరూ ఘజియాబాద్ లోని సుధామపురిలో నివసించేవారు. కొన్ని నెలల తరువాత జాన్వి జితేంద్రతో 'మనం పెళ్ళిచేసుకున్న విషయం మన కుటుంబాలకు చెప్పేద్దాం, వారిని ఒప్పించి వారితో కలిసి ఉందాం' అని చెప్పింది. అయితే కుటుంబ సభ్యులకు ఆమె గురించి చెబితే వారు తనను ఇంట్లో నుండి బయటకు తోసేస్తారని జితేంద్ర భయపడ్డాడు. భార్య ఒత్తిడి భరించలేక ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారమే ఆమెను సైలెంట్ గా మట్టుబెట్టాడు. ఇంటికి ఇరుగు పొరుగు ఉన్నవారితో నా భార్య గొడవ పడి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందని చెప్పాడు.

Viral Video: బండిని ఓ మహిళ డ్రైవ్ చేస్తోంటే.. కారులో వెళ్తూ ఎవరో వీడియో తీస్తున్నారని.. వెనుక కూర్చున్న యువతి ఏం చేసిందో చూస్తే..!


మే20వ తేదీన జితేంద్రకు తెలిసిన ఓ దుకాణాదారుడు అతని దగ్గరకు వెళ్ళి 'ఓ మృతదేహం దొరికింది, అది మీ భార్యదే అని అనుమానంగా ఉంది, ఓసారి వచ్చి చూడు' అని బలవంతం చేశాడు. దీంతో జితేంద్ర వెళ్ళి మృతదేహాన్ని చూసి తన భార్యే అని చెప్పాడు. పోలీసులు అతన్ని విచారించగా అతను పోలీసుల దగ్గర ఎక్కువసేపు నిజం దాచలేకపోయాడు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నా ఆమె చేతిమీద సాయిబా అనే టాటూ ఉండటంతో పోలీసులు విచారణ చేసి జితేంద్రను అక్కడికి రప్పించినట్టు తెలిసింది. పోలీసులముందు జితేంద్ర నిజం అంగీకరించాక అతనిమీద సెక్షన్ 302, 201 కింద కేసు నమోదు చేసి జ్యూడీషియల్ కస్టడీకి పంపిన్టటు పోలీసులు తెలిపారు.

Slum Girl: బాలీవుడ్ హీరోయిన్లు అక్కర్లేదంటూ 14 ఏళ్ల బాలికను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుందో కంపెనీ.. ఇంతకీ ఈ అమ్మాయి కథేంటంటే..!


Updated Date - 2023-05-22T19:56:55+05:30 IST