పొలం నుంచి కంగారుగా ఇంటికి వచ్చిన భర్త.. గదిలో పడి ఉన్న అపరిచిత వ్యక్తి ఫోన్‌లో భార్య వీడియోలు చూసి..

ABN , First Publish Date - 2023-01-22T09:33:05+05:30 IST

పొలం పనులకు వెళ్లిన ఓ వ్యక్తికి సడన్‌గా తమ్ముడి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో పనులు పక్కన పెట్టేసి కంగారుగా ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంటి బయట ఓ బైకి పార్కు చేసి ఉంది. లోపలకు వెళ్లగా భార్య ఏడుస్తూ కనిపించింది. అదే గదిలో..

పొలం నుంచి కంగారుగా ఇంటికి వచ్చిన భర్త.. గదిలో పడి ఉన్న అపరిచిత వ్యక్తి ఫోన్‌లో భార్య వీడియోలు చూసి..
ప్రతీకాత్మక చిత్రం

పొలం పనులకు వెళ్లిన ఓ వ్యక్తికి సడన్‌గా తమ్ముడి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో పనులు పక్కన పెట్టేసి కంగారుగా ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంటి బయట ఓ బైకి పార్కు చేసి ఉంది. లోపలకు వెళ్లగా భార్య ఏడుస్తూ కనిపించింది. అదే గదిలో అపరిచిత వ్యక్తి ఫోన్ పడి ఉంది. అందులో చూడగా భార్యకు సంబంధించిన అసభ్యకర వీడియోలు కనిపించాయి. ఊహించని ఈ ఘటనతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Viral Video: రైలు కదులుతుండగానే డోర్ తెరచి దిగేసిన వ్యక్తి.. చివరికి ఏమైందో చూడండి..

రాజస్థాన్ (Rajasthan) అజ్మీర్ జిల్లా భినయ్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన కిషోర్ ( పేరు మార్చాం) అనే వ్యక్తి.. తన భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇదిలావుండగా, జనవరి 4న అతను పొలం పనులకు వెళ్లాడు. ఆ సమయంలో అతడి భార్య ఒక్కటే ఇంట్లో ఉంది. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బైకులో అక్కడికి వచ్చి.. కిషోర్ ఇంటి ముందు ఆపాడు. బండిని పక్కనే ఆపి, ఎవరూ చూడని సమయంలో ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్లాడు. అపరిచిత వ్యక్తి ఇంట్లోకి రాగానే.. కిషోర్ భార్య భయపడిపోయింది. గట్టిగా అరిస్తే చంపేస్తానని బెదిరించి, ఆమెపై అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడ్డాడు. ఈ ఘటన మొత్తాన్ని వీడియో కూడా తీశాడు.

ఓ యువకుడికి 20 రోజులుగా భరించలేని కడుపునొప్పి.. ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు తీసిన ఎక్స్‌రేలో ఏం కనిపించిందంటే..

అయితే కొత్త వ్యక్తి ఇంట్లోకి వెళ్లడాన్ని గుర్తించిన కిషోర్ సోదరుడు.. ఎవరో చూద్దామని సడన్‌గా ఇంట్లోకి వెళ్లాడు. దీంతో లోపల ఉన్న యువకుడు భయంతో గోడ దూకి పారిపోయాడు. ఈ కంగారులో ఫోన్, బైకును అక్కడే వదిలి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న కిషోర్ ఇంటికి వచ్చి భార్యను విచారించాడు. ఎవరికైనా చెబితే పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు నిందితుడు.. కిషోర్ వద్దకు వచ్చి తన ఫోన్, బైకు అప్పజెప్పాలని బెదిరించాడు. దీంతో చివరకు పోలీసును ఆశ్రయించిన కిషోర్.. జరిగిన విషయంపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న కొడుకు.. నిజామా, కాదా అని నిర్ధారించుకునే లోపే ఓ రోజు..

Updated Date - 2023-01-22T09:33:11+05:30 IST