Viral News: పెళ్లయి ఎన్నేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని గొడవ.. విడాకులు తీసుకున్నాక గర్భం దాల్చిన భార్య.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!

ABN , First Publish Date - 2023-04-25T17:22:20+05:30 IST

వాళ్లిద్దరూ భార్యాభర్తలు. పెళ్లై పదేళ్లైంది. పెళ్లి తర్వాత పిల్లలు కలగలేదు. భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో విడాకులు (divorce) తీసేసుకున్నారు. అనంతరం ఇద్దరూ వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. కానీ ఇంతలోనే ఆమె

Viral News: పెళ్లయి ఎన్నేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని గొడవ.. విడాకులు తీసుకున్నాక గర్భం దాల్చిన భార్య.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!
Viral News

పెళ్లైయిన అమ్మాయి కనిపించిందంటే పెద్దోళ్లు అడిగేది.. ఏమైనా విశేషమా? లేదంటే ఎంత మంది పిల్లలు? అని అడుగుతుంటారు. ఇక పిల్లలు పుట్టడం కొంచెం ఆలస్యం అయితే భర్త నుంచో.. అత్తారింటి వాళ్ల నుంచో వేధింపులు మొదలవుతాయి. కొంత మందికి త్వరగా పుడుతుంటారు.. ఇంకొందరికీ ఆలస్యంగా పుడుతుంటారు. ఇలా సహజంగా జరుగుతుంటాయి.

వాళ్లిద్దరూ భార్యాభర్తలు. పెళ్లై పదేళ్లైంది. పెళ్లి తర్వాత పిల్లలు కలగలేదు. భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో విడాకులు (divorce) తీసేసుకున్నారు. అనంతరం ఇద్దరూ వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. కానీ ఇంతలోనే ఆమె గర్భవతి అయింది. ఆ ప్రెగ్నన్సీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ భర్త చేతులెత్తేశాడు. న్యాయం చేయాలంటూ భార్య (woman) ఏమో పోలీస్ స్టేషన్ మెట్టులెక్కింది. స్టేషన్‌లో పంచాయితీ చేస్తుండగా అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఇంతకీ ఏమైంది? ఆ గర్భం ఎలా వచ్చిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

గుజరాత్‌ (gujarat)లోని వడోదరకు చెందిన ఓ బాధితురాలు అభయం హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ చేసి తనకు సాయం చేయాలని కోరింది. విడాకుల తర్వాత ఎలా గర్భం వచ్చిందని హెల్ప్‌లైన్ నంబర్ వారు వివరాలు తెలుసుకున్నారు. అసలు విషయం చెప్పడంతో వారంతా షాకయ్యారు.

విడాకుల తర్వాత ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ అతను ఆమెను వదల్లేదు. వారి మధ్య రిలేషన్‌ కొనసాగుతూనే ఉంది. తరచుగా ఆమె దగ్గరకు వెళ్తూ వస్తుండేవాడు. అలా ఆమెతో శారీరక సంబంధం కొనసాగించాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 21న తాను ప్రెగ్నెంట్ (pregnant) అయినట్లు అతనికి విషయం చెప్పింది. ఈ వార్త వినగానే తనకే పాపం తెలియదంటూ బుకాయించాడు. ఆ బిడ్డకు తాను తండ్రిని కాదని గొడవకు దిగాడు. అతన్ని ఎంత బతిమలాడినా ఒప్పుకోకపోవడంతో ఆమె అభయం హెల్ప్‌లైన్ సాయం కోరింది.

అనంతరం రంగంలోకి దిగిన అభయం టీమ్.. వాళ్లిద్దర్నీ కలిపేందుకు ప్రయత్నం చేసింది. కానీ అతను మొండిగా వ్యవహరించాడు. చివరకు అభయం టీమ్.. ఆమెను కర్జాన్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి అక్కడ పంచాయితీ పెట్టించారు. ఆమె బంధువులు కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అక్కడికి వచ్చాక తాము పరస్పర అంగీకారంతో ఈ మ్యాటర్ సెటిల్ చేసుకుంటామని చెప్పడంతో మీ ఇష్టం అంటూ పోలీసులు తప్పించుకున్నారు.

Updated Date - 2023-04-25T17:22:20+05:30 IST