నా భార్య పుట్టింటికి వెళ్లింది.. పార్టీ చేసుకుందాం రా.. అని ఫ్రెండును పిలిచాడో వ్యక్తి.. షాకింగ్ సీన్ చూసి పక్కింటి మహిళ కేకలు పెట్టడంతో..
ABN , First Publish Date - 2023-03-28T15:19:27+05:30 IST
మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నరరూప రాక్షసుడిలా ప్రవర్తించి గ్రామస్థులందరినీ హడలెత్తించాడు. షాకింగ్ క్రైమ్కు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగ సంచలనంగా మారింది.
మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నరరూప రాక్షసుడిలా ప్రవర్తించి గ్రామస్థులందరినీ హడలెత్తించాడు. ఇంట్లో ఎవరూ లేరని, పార్టీ చేసుకుందాం రా అని స్నేహితుడు పిలిస్తే అతడి ఇంటికి వెళ్లాడు.. ఇద్దరూ కలిసి బాగా మద్యం సేవించారు.. మద్యం మత్తులో ఇద్దరూ గొడవపడ్డారు.. ఆ గొడవలో స్నేహితుడిని చంపేశాడు.. అతడి శరీరాన్ని 12 ముక్కలుగా కోశాడు.. తలను వేరు చేసి దానిని పట్టుకుని డాబాపై వాకింగ్ చేయడం మొదలుపెట్టాడు.. పక్కింటి మహిళ చూసి కేకలు వేయడంతో మొత్తం విషయం బయటపడింది (Crime News).
కొత్వాలి పరిధిలోని మజ్మని కాలా గ్రామానికి చెందిన సూరజ్ అనే వ్యక్తి సోమవారం మధ్యాహ్నం తన స్నేహితుడు శంభు ఇంటికి వెళ్లాడు. శంభు భార్య పుట్టింటికి వెళ్లడంతో సూరజ్ మద్యం సేవించేందుకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న సూరజ్, శంభు మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన సూరజ్ పదునైన ఆయుధంతో శంభుపై దాడి చేశాడు. శంభు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం శంభు మృతదేహాన్ని 12 ముక్కలుగా కోశాడు. శరీరం నుంచి తలను వేరే చేశాడు (Man Killed Friend).
Viral Video: కుర్రాడిని కాపాడడం కోసం రిస్క్ చేసిన విండీస్ కెప్టెన్.. వైరల్ అవుతున్న వీడియో!
సాయంత్రం 4 గంటల సమయంలో శంభు తల పట్టుకుని సూరజ్ డాబా ఎక్కి వాకింగ్ చేయడం ప్రారంభించాడు. పక్కింటి మహిళ సూరజ్ చేతిలో ఉన్న శంభు తలని చూసి కేకలు వేసింది. దీంతో ఆ తలను సూరజ్ బయటకు విసిరేశాడు. చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చే వరకు సూరజ్ అక్కడే కూర్చుని ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.