NCBN Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు జైలు దృశ్యాలు లీక్ చేస్తోందెవరు?

ABN , First Publish Date - 2023-09-12T16:33:10+05:30 IST

గన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి సొంత మీడియాను ఒకలా, వేరే మీడియాను మరోలా ట్రీట్ చేస్తోంది. ఇటీవల చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు కూడా సాక్షి జర్నలిస్టులు విచారణ గదిలో కనిపించడం కలకలం రేపింది. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు అడుగుపెట్టే దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జైలు ప్రధాన గేటుకు 20 మీటర్ల ముందే మీడియాను, ఇతరులను ఆపేశారని.. అలాంటప్పుడు చంద్రబాబు లోపలకు వెళ్తున్న ఫోటోలు, వీడియోలను ఎవరు తీశారని ప్రశ్నిస్తున్నారు.

NCBN Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు జైలు దృశ్యాలు లీక్ చేస్తోందెవరు?

స్కిల్ డెవలప్ మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు అడుగుపెట్టే దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

సాధారణంగా జైలు ప్రధాన గేటుకు 20 మీటర్ల ముందే మీడియాను, ఇతరులను ఆపేశారని.. అలాంటప్పుడు చంద్రబాబు లోపలకు వెళ్తున్న ఫోటోలు, వీడియోలను ఎవరు తీశారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జైలు రెండో గేటులోకి రిమాండ్‌లో ఉన్న వారిని మినహా ఎవరినీ అనుమతించరని.. సెల్‌ఫోన్లు, కెమెరాలతో వీడియోలు తీయడం నిషిద్ధం అయినప్పుడు ఈ వీడియోలు ఎలా బయటకు వచ్చాయని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. ఒకవేళ సీఎం జగన్ సొంత మీడియా సాక్షి జర్నలిస్టులకు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు జైలు లోపలకు వెళ్లడం వంటి ఫోటోలు, వీడియోలను చూసి వైసీపీ నేతలు శునకానందం పొందడానికే ఈ విధంగా లీకులు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: AP Politics: జగన్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరమేంటి? కారణం ఇదేనా?

వాస్తవానికి జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి సొంత మీడియాను ఒకలా, వేరే మీడియాను మరోలా ట్రీట్ చేస్తోంది. ఇటీవల చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు కూడా సాక్షి జర్నలిస్టులు విచారణ గదిలో కనిపించడం కలకలం రేపింది. సిట్ కార్యాలయంలో అధికారులతో పాటు సాక్షి పత్రిక ఫోటోగ్రాఫర్ లక్ష్మీపవన్, సాక్షి టీవీ ఛానల్ కెమెరామెన్ సత్య కనిపించడం వివాదాస్పదంగా మారింది. సాక్షి జర్నలిస్టుల సమక్షంలో సీఐడీ అధికారులు విచారించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు చంద్రబాబు రాజమండ్రి జైలు లోపలకు వెళ్లే దృశ్యాలను లీక్ చేయడం వెనుక కూడా సాక్షి సిబ్బంది హస్తం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. సాక్షి సిబ్బంది కాకపోతే పోలీసులే ఎవరైనా రికార్డు చేసి వైసీపీ నేతలకు చేరవేస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న ఏపీ పోలీసులు టీడీపీ నేతలను మాత్రం హౌస్ అరెస్టులు చేయడం, శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని లాఠీలతో కొట్టడం లాంటివి చేస్తున్నారు. భవిష్యత్‌లో తాము చేసిన కర్మకు ఫలితం అనుభవించక తప్పదని సదరు పోలీసులను నెటిజన్‌లు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-09-12T16:33:10+05:30 IST