MLC Kavitha : ఏడు గంటలుగా కవితపై ఈడీ ప్రశ్నల వర్షం.. హస్తినలో మారిపోయిన సీన్.. భారీగా పోలీసులు మోహరించడంతో..!

ABN , First Publish Date - 2023-03-20T18:20:53+05:30 IST

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను..

MLC Kavitha : ఏడు గంటలుగా కవితపై ఈడీ ప్రశ్నల వర్షం.. హస్తినలో మారిపోయిన సీన్.. భారీగా పోలీసులు మోహరించడంతో..!

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు (ED Officers) విచారిస్తున్నారు. అంటే ఇప్పటి వరకూ మొత్తం 7 గంటలపాటు కవితను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈడీ సంధించిన పలు ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదని తెలియవచ్చింది. కవిత, అరుణ్‌ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్‌ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు.

అసలేం జరుగుతోంది..!

సాయంత్రం 6 గంటలు అయినా ఇంతవరకూ కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటికి రాకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోయింది. మొదటిసారి కవితను విచారించినప్పుడే సాయంత్రం 6 గంటలు దాటితే మహిళను విచారించకూడదని.. అది చట్ట విరుద్ధమని కవిత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే రెండోరోజు విచారణలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో అసలు ఈడీ కార్యాలయంలో ఏం జరుగుతోంది..? ఏం జరగబోతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

ఒక్కసారిగా మారిన సీన్..!

మరోవైపు.. ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లారు. న్యాయవాదులు ఎందుకొచ్చారు..? కవితను అరెస్ట్ చేసే సూచనలు ఏమైనా ఉన్నాయా..? అనేది బీఆర్ఎస్ పెద్దలకు అర్థం కావట్లేదు. ఉదయం నుంచి ఈడీ కార్యాలయం చుట్టుపక్కలా పరిస్థితి అంతా సాధారణంగానే ఉంది. అయితే.. ఆఫీసు దగ్గరికి న్యాయవాదులు వచ్చేసరికి ఒక్కసారిగా హస్తినలో సీన్ మారిపోయింది. దీంతో ఏం జరుగుతోందో ఏంటో అని బీఆర్ఎస్ శ్రేణులు టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారు.

డాక్టర్లు ఎందుకు..?

మరోవైపు.. డాక్టర్లు కూడా ఈడీ కార్యాలయంలోకి వెళ్లడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మరింత పెరిగిపోయింది. ఇదివరకే న్యాయవాదులు ఈడీ కార్యాలయంలోకి వెళ్లడం.. తాజాగా ఇద్దరు వైద్యులు కూడా వెళ్లడంతో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. అయితే డాక్టర్లు ఎందుకు లోపలికి వెళ్లారనేది తెలియట్లేదు.

మొత్తానికి చూస్తే.. సోమవారం ఆరు గంటల తర్వాత ఢిల్లీలో అయితే సీన్ మారిపోయింది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఏం జరుగుతుందో తెలియాలంటే మరో అరగంటపాటు వేచి చూడక తప్పదేమో మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

YSRCP : వైసీపీలో ఇంత చిల్లర బ్యాచ్ ఉందేంట్రా బాబోయ్.. ఛీ.. ఛీ.. సిగ్గో సిగ్గు..!

******************************

AP MLC Election Results 2023 : వైఎస్ జగన్‌ను ఏకిపారేస్తున్న వైసీపీ సోషల్ మీడియా.. ఏమైందా అని ఆరాతీస్తే..!

******************************

Janasena : పవన్ పదే పదే ‘కాపు’ ప్రస్తావన తేవడం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉందిగా.. ఇదేగానీ వర్కవుట్ అయితే..!
******************************




Updated Date - 2023-03-20T18:44:04+05:30 IST