BRS MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. తెలంగాణ సర్కార్‌ పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం ఇదీ..

ABN , First Publish Date - 2023-02-07T18:11:03+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (BRS MLAs Poaching Case) కీలక పరిణామం చోటుచేసుకుంది..

BRS MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. తెలంగాణ సర్కార్‌ పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం ఇదీ..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (BRS MLAs Poaching Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును (Supreme Court ) ఆశ్రయించింది. పిటిషన్‌ను సుప్రీంకోర్టు అంగీకరించింది. దీన్ని వెంటనే విచారణకు తీసుకోవాలని న్యాయవాది దుష్యంత్ దవే.. (Dushyant Dave) సుప్రీంను కోరారు. సీబీఐ (CBI) విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలు ధ్వంసం అవుతాయని కోర్టుకు దుష్యంత్ దవే ఆందోళన వెలిబుచ్చారు. బుధవారం నాడు ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని దుష్యంత్ దవేకు సీజేఐ చంద్రచూడ్ (CJI Chandrachud) సూచించారు. రేపు ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామని సీజేఐ (CJI) తెలిపారు. ఒకవేళ రేపు మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందని చంద్రచూడ్ తెలిపారు. అంతకుముందు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు (TS HighCourt) తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును వ్యతిరేకించిన తెలంగాణ సర్కార్ (TS Sarkar) సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది.

Supreme-Court.jpg

నిన్న అసలేం జరిగింది..!?

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, సిట్‌ దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. ప్రభుత్వ అప్పీల్‌ పిటిషన్‌లకు విచారణార్హత లేదని పేర్కొంటూ చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎన్‌ తుకారాంజీ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. దీనిపై సుప్రీంకోర్టుకే వెళ్లాలని తేల్చిచెప్పింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో సిట్‌ అప్పటివరకూ చేసిన దర్యాప్తును.. ఎవరూ అడగకముందే సింగిల్‌ జడ్జి క్వాష్‌ చేశారని.. సిట్‌ జీవోను కొట్టేశారని.. అత్యంత అసాధారణమైన ఆదేశాలను జారీచేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎటువంటి ఆధారాలను పరిశీలించకుండానే దర్యాప్తును సీబీఐకి ఇచ్చారని.. ఇది రాష్ట్రపోలీసుల హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. అత్యంత సమర్థులైన ఐపీఎస్‌ అధికారులు కలిగిన సిట్‌ను కాదని.. కేసును సీబీఐకి బదిలీ చేయడానికి సరైన కారణాలు లేవని అభ్యంతరం చెప్పారు.

TS-High-Court.jpg

తప్పులేదని..!

ముఖ్యమంత్రి దీనిపై పత్రికా సమావేశం పెట్టడం దర్యాప్తులో జోక్యం కిందికి రాదని.. ఒక రాజకీయ పార్టీ చట్టబద్ధంగా, తన రాజకీయ లక్ష్యాల మేరకు చేసిన రాజకీయ కార్యక్రమంగానే చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వాధినేతగా తన ప్రభుత్వానికి ప్రమాదం పొంచిఉందని సీఎం చెప్పడంలో తప్పులేదని తెలిపారు. నిందితులకు, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి మధ్య జరిగిన సంభాషణల ఎలక్ట్రానిక్‌ ఆధారాలు అప్పటికే జనబాహుళ్యంలో ఉన్నాయని.. వాటిని ముఖ్యమంత్రికి పోలీసులు ఇవ్వలేదని స్పష్టంచేశారు. ఆ ఆధారాలను సీఎం వివిధ హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు పంపడం దర్యాప్తులో జోక్యం చేసుకోవడం కిందికి రాదని పేర్కొన్నారు. నిందితులు బేరసారాలు చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారని.. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయని గుర్తుచేశారు.

******************************************

ఇవి కూడా చదవండి..

******************************************

MLA purchase Case: సుప్రీంకే వెళ్లండి!


******************************************

BRS MLAs Poaching Case: హైకోర్టు తీర్పుపై సుప్రీమ్‌కు వెళ్లాలని సిట్ నిర్ణయం

******************************************

Updated Date - 2023-02-07T18:31:11+05:30 IST