NRI: హాంగ్ కాంగ్‌లో ఘనంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు

ABN , First Publish Date - 2023-02-23T08:40:12+05:30 IST

ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో హాంగ్ కాంగ్‌లో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

NRI: హాంగ్ కాంగ్‌లో ఘనంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు

ఎన్నారై డెస్క్: ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో హాంగ్ కాంగ్‌లో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 2019 నుంచి తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు జరుపుతున్నామని, ఇది ముఖ్యంగా మన శ్రీసమస్, ఆంగ్ల నూతన సంవత్సరం మరియు అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవంని కలిపి జరుపుకునే తెలుగు పండుగ. ఈ ఏడాది హాంగ్ కాంగ్‌లో పిల్లలచే ఘనంగా జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఫ్యాన్సీ డ్రస్, తెలుగు భక్తి గీతాలు, పద్యాలు, పాటలు, సాంప్రదాయ - సమకాలీన - జానపద నృత్యాలను ప్రదర్శించారు. అలాగే పిల్లలు తేజస్వి సారంగా, వరుణ్ నాల్గె వ్యాఖ్యాతలుగా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు.

HHH.jpg

పిల్లలను ప్రోత్సహిస్తూ పూర్వ కార్యదర్శి ఫాథర్ మిరియాల బాల కిశోర్ ప్రశంస పత్రాలను అందజేశారు. విదేశాలలో వుంటూ మాతృ భాష - సాంప్రదాయాలను తమ పిల్లలకు శ్రద్ధగా నేర్పిస్తున్నందుకు తల్లిదండ్రులను అభినందించారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి సభకు కృతజ్ఞతలు సమర్పిస్తూ సమాఖ్య కార్యవర్గ సభ్యులు ఫాథర్ బాల కిశోర్, రాజశేఖర్ మన్నే, రమాదేవి సారంగా, కొండ మాధురి, హర్షిణి పచ్చ౦టి, కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలను వారి తల్లి తండ్రులను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

HH.jpg

అనంతరం హాంగ్ కాంగ్ బాంగ్లాదేశ్ అసోసియేషన్ వారు నిర్వహించిన “ఫిబ్రవరి 21 భాషోధ్యమ దినం” సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధులలో ఒకరిగా జయ పీసపాటి పాల్గొన్నారు. బంగ్లాదేశ్ అసోసియేషన్ ఆఫ్ హాంగ్ కాంగ్ అధ్యక్షులు సయ్యద్ మోహిఉద్దీన్ మోహి ముఖ్య అతిధి మిస్ ఇసరత్ ఆరా, ఇతర హాంగ్ కాంగ్ ప్రభుత్వ అధికారులను, UNESCO HK Glocal Peace Centre - హాంగ్ కాంగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు మిటజీ లీయోంగ్, కమిటీ సభ్యుడు తిరుపతి నాచియప్పన, ఇతర ప్రముఖ స్వచ్ఛంద సంస్థల ప్రధాన ప్రతినిధులను సాదరంగా ఆహ్వానించారు.

HHHH.jpg

ఈ సందర్భంగా బాంగ్లాదేశ్ కౌన్సుల్ జనరల్ ఇసరత్ ఆరా మాట్లాడుతూ.. భాష సమాన హోదా కోసం ఉద్యమం గురించి వివరించారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం ర్యాలీలు, ఇతర నిరసన కార్యక్రమాలను ఢాకా నగరంలో నిషేధించిందని గుర్తు చేశారు. ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు, సాధారణ ప్రజల సహకారంతో భారీ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేశారని ప్రపంచంలోనే భాష కోసం ఇంత పెద్ద ఉద్యమం చేసిన ఘనత బాంగ్లాదేశ్‌కు మాత్రమే దక్కుతుందని తెలిపారు. 1952 ఫిబ్రవరి 21న ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సలాం, బర్కాట్, రఫీక్, జబ్బర్, షఫియూర్ మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. చరిత్రలో ఇది చాలా అరుదైన సంఘటన, ప్రజలు తమ మాతృభాష కోసం ప్రాణాలను అర్పించారని, అమరులైన వారికి ఇసరత్ ఆరా నివాళులు అర్పించారు.

HHHHHH.jpg

ఆ తరువాత మిటజీ లీయోంగ్ మాట్లాడుతూ.. యూనెస్కో(UNESCO) చేపట్టిన మాతృభాష పరిరక్షణ కార్యక్రమం గురించి వివరించారు. తాము నిరుడు జూమ్ ద్వారా వర్చువల్‌గా నిర్వహించిన అంతర్ జాతీయ మాతృ భాష దినోత్సవంలో భారతీయ భాషలతో పాటు విదేశీ భాషలతో కలుపుకొని పదహారు భాషలతో పిల్లలు పాల్గొన్నారని జయ పీసపాటి తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని భాషలను కలిపే ప్రయత్నం చేస్తున్నామని అందుకు విచ్చేసిన ప్రతినిధుల సహాయం కోరారు. ఇతర అతిథులు తమ మాతృ భాష ప్రాముఖ్యత గురించి మరియు కార్యక్రమాల గురించి తెలిపారు. తదనంతరం పిల్లలు పాడిన దేశభక్తి గీతాలు పాడగా, అనంతరం బీఏహెచ్‌కే (BAHK) జనరల్ సెక్రెటరీ రహమాన్ పలాష్ వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.

HHHHH.jpg

Updated Date - 2023-02-23T08:40:13+05:30 IST