Abu Dhabi Big Ticket: భారత ప్రవాసుడికి జాక్‌పాట్.. రాత్రికి రాత్రే బ్యాంక్ ఖాతాలోకి రూ.33కోట్లు..!

ABN , First Publish Date - 2023-07-05T08:46:44+05:30 IST

అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అప్పటివరకు సాధారణ జీవితం గడిపిన వాళ్లు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వర్లుగా అవతరిస్తుంటారు.

Abu Dhabi Big Ticket: భారత ప్రవాసుడికి జాక్‌పాట్.. రాత్రికి రాత్రే బ్యాంక్ ఖాతాలోకి రూ.33కోట్లు..!

దుబాయి: అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అప్పటివరకు సాధారణ జీవితం గడిపిన వాళ్లు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వర్లుగా అవతరిస్తుంటారు. ఇది కేవలం లాటరీ వల్లే సాధ్యమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉమ్ అల్ క్వైన్‌లో ఉండే భారత ప్రవాసుడి విషయంలో కూడా అదే జరిగింది. అబుదాబి బిగ్‌టికెట్ డ్రాలో (Big Ticket Abu Dhabi) భారత ప్రవాసుడికి జాక్‌పాట్ తగిలింది. సోమవారం నిర్వహించిన డ్రాలో మహ్మద్ అలీ మొయిదీన్ అనే భారతీయుడు ఏకంగా 15 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో అక్షరాల రూ. 33.50కోట్లు. గత నెల 7వ తేదీన అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం. 061908కు ఈ జాక్‌పాట్ తగిలింది. షో హోస్ట్ అయిన రిచర్డ్ ఫోన్ ద్వారా అలీకి విజేతగా నిలిచిన విషయాన్ని తెలియజేశారు.

కానీ, మొదట అతడి నుంచి సరియైన స్పందన రాలేదట. దాంతో డ్రా ముగిసిన తర్వాత మరోసారి నిర్వహకులు ఫోన్ చేయడంతో అలీ మాట్లాడారట. 15 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నట్లు చెప్పడంతో అతడు ఎగిరిగంతేసినంత పని చేసినట్లు హోస్ట్ రిచర్డ్ చెప్పుకొచ్చాడు. "ఇది ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఈ ఆనంద సమయంలో ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. నోటమాట రావడం లేదంటే నమ్మండి. ఇది నేను అస్సలు ఊహించనిది. 2023 బాగా కలిసొచ్చింది. ఇంత పెద్ద జాక్‌పాట్ తగలడం మాటల్లో చెప్పలేని అనుభూతి." అని ప్రముఖ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ మహ్మద్ అలీ మొయిదీన్ అన్నాడు. ఇక తాను గెలుచుకున్న భారీ ప్రైజ్‌మనీ కొంత భాగాన్ని చారిటీకి వినియోగిస్తానని తెలిపాడు.

Indians: భారతీయులు ఎక్కువగా వలస వెళ్లే టాప్ దేశాలు ఏవంటే..

Updated Date - 2023-07-05T08:46:44+05:30 IST