Mahzooz draw: లక్ అంటే నీదే భయ్యా.. రూ.5.61లక్షలు ఖర్చు చేస్తే.. రూ.45కోట్ల జాక్‌పాట్!

ABN , First Publish Date - 2023-08-03T09:35:46+05:30 IST

దుబాయిలో ఉండే భారత వ్యక్తికి లాటరీ రూపంలో అదృష్టం వరించింది. దాంతో మనోడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా అవతరించాడు.

Mahzooz draw: లక్ అంటే నీదే భయ్యా.. రూ.5.61లక్షలు ఖర్చు చేస్తే.. రూ.45కోట్ల జాక్‌పాట్!

Mahzooz draw: దుబాయిలో ఉండే భారత వ్యక్తికి లాటరీ రూపంలో అదృష్టం వరించింది. దాంతో మనోడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా అవతరించాడు. తాజాగా నిర్వహించిన మహ్జూజ్ డ్రా (Mahzooz draw) లో భారత్‌కు చెందిన సచిన్‌ జాక్‌పాట్ కొట్టాడు. గ్రాండ్ ప్రైజ్ రూపంలో 20 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో సుమారు రూ. 45కోట్లు. ముంబై (Mumbai) కి చెందిన సచిన్ పాతికేళ్ల నుంచి దుబాయిలో ఉంటున్నాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో సీఏడీ టెక్నీషియన్‌ (CAD Technician) గా పని చేస్తున్నాడు. గత రెండేళ్ల నుంచి మహ్జూజ్ డ్రాలో పాల్గొంటున్నాడు. ఇప్పటివరకు అతడు దీనికోసం 25వేల దిర్హమ్స్ (రూ.5.61లక్షలు) ఖర్చు చేశాడు.

ఈ క్రమంలో జూలై 29న నిర్వహించిన వీక్లీ డ్రాలో సచిన్‌‌ (Sachin) కు అదృష్టం వరించింది. ఈ డ్రాలో విజేతగా నిలిచిన అతడు రూ. 45కోట్లు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. "ఈ విజయం నాకు నిజంగా షాక్ ఇచ్చింది. ఈ వార్త నా దినచర్యను మార్చేసింది. మహ్జూజ్ అధికారుల నుండి నాకు కాల్ వచ్చినప్పటి నుండి నేను సరిగ్గా నిద్రపోలేకపోతున్నానంటే నమ్మండి" అని చెప్పుకొచ్చాడు. ఇక తాను గెలిచిన ఈ భారీ ప్రైజ్‌మనీని పిల్లల చదువులకు, మంచి లాభాలు వచ్చే వ్యాపారాలలో పెట్టుబడిగా పెడతానని సచిన్ అన్నాడు.

Indian American: హిందీలో మాట్లాడడమే ఈ భారతీయ వ్యక్తి చేసిన తప్పు.. ఉద్యోగం నుంచి తొలగించిన అమెరికన్ కంపెనీ


Updated Date - 2023-08-03T09:35:46+05:30 IST