Gulf: 'గల్ఫ్' మోసాలు.. అమాయకులే ఆ ఏజెంట్ టార్గెట్‌..!

ABN , First Publish Date - 2023-08-28T13:56:35+05:30 IST

నిజామాబాద్ జిల్లాలో గల్ఫ్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు అమాయక ప్రజలను ఆసరగా చేసుకొని గల్ఫ్‌కు పంపిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు.

Gulf: 'గల్ఫ్' మోసాలు.. అమాయకులే ఆ ఏజెంట్ టార్గెట్‌..!

గల్ఫ్ ఏజెంట్ ఘరానా మోసం..!

నిజామాబాద్: జిల్లాలో గల్ఫ్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు అమాయక ప్రజలను ఆసరగా చేసుకొని గల్ఫ్‌కు పంపిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఉపాధి దొరకకపోవడంతో తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం గల్ఫ్ బాట పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన ఓ ఏజెంట్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. సుమారు 40 మంది వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ఉడాయించినట్టు బాధితులు వాపోయారు. ఆదివారం ఏజెంట్ ఇంటి ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. తమ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే గల్ఫ్ ఏజెంట్ ఇదీ వరకే అరెస్టు కావడంతో కుటుంబ సభ్యులను నిలదీశారు. ఎలాగైనా డబ్బులు చెల్లించాలని.. తాము కూడా అప్పు తెచ్చి ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాధితులను సముదాయించి పంపించారు.

NRI Mother: ఎన్నారై మహిళ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. తాగే నీళ్లల్లో కూడా విషం కలిపారట.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..!


Updated Date - 2023-08-28T13:56:35+05:30 IST