Share News

Year Ender 2023: ఈ ఏడాది భారత్ నెలకొల్పిన 12 ప్రపంచ రికార్డులు ఇవే!

ABN , Publish Date - Dec 30 , 2023 | 11:22 AM

2023 సంవత్సరం ఇక ముగిసినట్టే. ఈ సంవత్సరం ముగియడానికి మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. మరికొన్ని గంటల్లోనే ఈ ఏడాదికి శుభం కార్డు పడనుంది. 2023 సంవత్సరం ముగిసిందనే బాధను కళ్లలో నింపుకుని, కొత్త సంవత్సరం 2024 రాబోతుందనే సంతోషకరమైన మోహంతో అందరూ కనిపించనున్నారు.

Year Ender 2023: ఈ ఏడాది భారత్ నెలకొల్పిన 12 ప్రపంచ రికార్డులు ఇవే!

2023 సంవత్సరం ఇక ముగిసినట్టే. ఈ సంవత్సరం ముగియడానికి మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. మరికొన్ని గంటల్లోనే ఈ ఏడాదికి శుభం కార్డు పడనుంది. 2023 సంవత్సరం ముగిసిందనే బాధను కళ్లలో నింపుకుని, కొత్త సంవత్సరం 2024 రాబోతుందనే సంతోషకరమైన మోహంతో అందరూ కనిపించనున్నారు. అన్ని సంవత్సరాల మాదిరిగానే ఈ ఏడాది కూడా మన దేశంలో అనేక ఘనతలు చోటుచేసుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే గత సంవత్సరాల కంటే 2023లో మన దేశంలో ఎక్కువ ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. చంద్రయాన్ నుంచి అత్యధిక జనాభా వరకు ఈ సారి మన దేశం చాలా రికార్డులనే నెలకొల్పింది. మొత్తంగా ఈ సారి మన దేశం నెలకొల్పిన టాప్ 12 ప్రపంచ రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం.


1. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ మైలురాయిని చేరుకుంది.

2. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ నెట్‌వర్క్‌ భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది.

3. వారణాసిలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వర్వేద్ మహామందిర్‌ను ప్రారంభించారు. ఇందులో ఒకేసారి 20 వేల మంది ధ్యానం చేసుకోవచ్చు.

4. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ నౌక ‘ఎంవీ గంగా విలాస్’ను జనవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది భారత్, బంగ్లాదేశ్‌లోని 27 నదుల గుండా 50 రోజులపాటు ప్రయాణించనుంది.

5. 21 జూన్ 2023న గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహించిన యోగా సెషన్‌లో ఒకేసారి 1,47,952 మంది పాల్గొని యోగా చేశారు. దీంతో ఒకేసారి అత్యధిక మంది చేసిన యోగా సెషన్‌గా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.

6. భారత విమానయన సంస్థ ఎయిర్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల ఒప్పందాన్ని చేసుకుంది. ఒకేసారి 470 విమానాల కోసం ఆర్డర్ చేసింది. యూరోపియన్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌తో 250, అమెరికన్ జెయింట్ బోయింగ్‌తో 220 విమానాల కోసం ఒప్పందం చేసుకుంది. వీటి విలువ 70 బిలియన్ డాలర్లుగా ఉంది.

7. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. ఈ జాబితాలో యూకే ఐదో స్థానంలో ఉంది.

8. MyGovIndia డేటా ప్రకారం డిజిటల్ చెల్లింపుల జాబితాలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. మన దేశంలో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి.

9. గుజరాత్‌లోని సూరత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం సూరత్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభించారు. దీనిని 6,59,611 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు.

10. ఒకేసారి అత్యధిక దీపాలను వెలిగించిన కార్యక్రమంగా ‘అయోధ్య దీపోత్సవం’ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో ఏకంగా 22.23 లక్షలకు పైగా దీపాలను వెలిగించారు.

11. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సొరంగం కూలిన ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న 41 మందిని నవంబర్ 12న రక్షించారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగం ఎస్కేప్ ఆపరేషన్‌గా ఇది నిలిచిపోయింది.

12. ఈ ఏడాదిలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశంగా భారత్ అవతరించింది. ఈ క్రమంలో 142.57 కోట్ల జనాభా ఉన్న చైనాను భారత్ అధిగమించింది. ప్రస్తుతం మన దేశ జనాభా 142.86 కోట్లుగా ఉంది.

Updated Date - Dec 30 , 2023 | 11:36 AM