Sushil Kumar Modi: నితీశ్ వేడుకున్నా.. ఎన్డీఏలో చేర్చుకోం: సుశీల్ కుమార్ మోదీ

ABN , First Publish Date - 2023-09-25T19:21:57+05:30 IST

బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్(Nithish Kumar) ఎన్డీఏ(NDA)లో చేరాలని భావిస్తున్నారనే వార్తలను ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ(Sushil Kumar Modi) ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో నితీశ్ ను ఎన్డీఏలో చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు.

Sushil Kumar Modi: నితీశ్ వేడుకున్నా.. ఎన్డీఏలో చేర్చుకోం: సుశీల్ కుమార్ మోదీ

పాట్నా: బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్(Nithish Kumar) ఎన్డీఏ(NDA)లో చేరాలని భావిస్తున్నారనే వార్తలను ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ(Sushil Kumar Modi) ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో నితీశ్ ను ఎన్డీఏలో చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. నితీశ్ తాజాగా బీజేపీకి చెందిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఆయన మళ్లీ బీజేపీతో జత కడుతున్నారు అనే రూమర్స్ బయటకి వచ్చాయి.


ఈ అంశంపై స్పందించిన సుశీల్ మాట్లాడుతూ.. నితీశ్ కు ఎన్డీఏ తలుపులు మూసుకుపోయాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith Shah) చెప్పారని.. ఇదే విషయాన్ని రెండు సార్లు నొక్కివక్కానించారని పేర్కొన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలతో పాటు 2025 బిహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా పోటీ చేస్తుందని.. అంతిమ విజయం తమ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం నితీశ్‌ మీడియాతో మాట్లాడుతూ తాను మళ్లీ ఎన్డీఏలోకి వెళ్లవచ్చేనేలా సంకేతాలిస్తూ మాట్లాడటంతో ఆ కూటమిలో చేరిక అంశం లాంఛనమే అని భావించారు పొలిటికల్ విశ్లేషకులు.

Updated Date - 2023-09-25T19:21:57+05:30 IST