Gujarat : అహ్మదాబాద్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. 100 మంది రోగుల తరలింపు..

ABN , First Publish Date - 2023-07-30T09:03:16+05:30 IST

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ బహుళ అంతస్థుల ఆసుపత్రిలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో 100 మంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక బృందాలు కృషి చేస్తున్నాయి. ఈ ఆసుపత్రి బేస్‌మెంట్‌లో ఈ ప్రమాదం ప్రారంభమైంది. దట్టమైన పొగ ఆ పరిసరాలను చుట్టుముట్టింది.

Gujarat : అహ్మదాబాద్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. 100 మంది రోగుల తరలింపు..

అహ్మదాబాద్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ బహుళ అంతస్థుల ఆసుపత్రిలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో 100 మంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక బృందాలు కృషి చేస్తున్నాయి. ఈ ఆసుపత్రి బేస్‌మెంట్‌లో ఈ ప్రమాదం ప్రారంభమైంది. దట్టమైన పొగ ఆ పరిసరాలను చుట్టుముట్టింది.

పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎండీ చంపావత్ తెలిపిన వివరాల ప్రకారం, సాహిబాగ్ ప్రాంతంలోని రాజస్థాన్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ బహుళ అంతస్థుల ఆసుపత్రిలోని బేస్‌మెంట్‌ నుంచి దట్టమైన పొగ వస్తోంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక బృందాలు కృషి చేస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఆసుపత్రిలోని దాదాపు 100 మంది రోగులను సురక్షిత ప్రదేశానికి తరలించారు.

ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఓ చారిటబుల్ ట్రస్ట్ ఈ ఆసుపత్రిని నిర్వహిస్తోంది.


ఇవి కూడా చదవండి :

BJP state president: మణిపూర్‌ అంతా ప్రశాంతంగానే ఉందిగా..

BJP: బీజేపీ ఇన్‌చార్జిగా సీటీ రవి కొనసాగుతారా?

Updated Date - 2023-07-30T09:03:16+05:30 IST