నరసింహ సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2023-04-12T00:25:14+05:30 IST

ఐటీడీపీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి శ్రీ నర సింహ క్రియాశీలక కార్యకర్తగా పాల్గొంటూ అన్ని కార్యక్రమాలు విజయవంతం చేశారని టీడీపీ యువ నాయకుడు పుత్తా చైతన్యరెడ్డి అన్నారు.

నరసింహ సేవలు మరువలేనివి

ఐటీడీపీ నరసింహ సంస్మరణ సభలో వక్తలు

కమలాపురం రూరల్‌, ఏప్రిల్‌ 11 : ఐటీడీపీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి శ్రీ నర సింహ క్రియాశీలక కార్యకర్తగా పాల్గొంటూ అన్ని కార్యక్రమాలు విజయవంతం చేశారని టీడీపీ యువ నాయకుడు పుత్తా చైతన్యరెడ్డి అన్నారు. మంగళవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాపురం నియోజకవర్గ ఇన్‌చఆర్జ్‌ పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ కార్యాలయంలో ఐటీడీపీ నరసింహ సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసింహ టీడీపీ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పాల్గొనేవాడని, అలాంటి నాయకులు తమ మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. నరసింహ కుటుంబాన్ని పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు అంకిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుజ్జుల నారాయణ, జిల్లా బీసీ రాష్ట్ర జిల్లా తెలుగు యువత అధ్యక్షులు టీఎన్‌టీయూసీ కార్యదర్శి మల్లేష్‌ రాయల్‌, తెలుగు యువత మండల అధ్యక్షుడు యర్రబెల్లి సుబ్బారెడ్డి, 19వ వార్డు కౌన్సిలర్‌ అజ్మతుల్లా, కమలాపురం నియోజకవర్గ కాపు ప్రచార కార్యదర్శి దాదిరా మయ్య, వీఎన్‌పల్లి మండల ప్రధాన కార్యదర్శి తలపనూరు గంగిరెడ్డి, వాణిజ్య విభాగాల అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, బోయిళ్ల శంకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, గంగవరం ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-12T00:25:18+05:30 IST